అన్వేషించండి

Bigg Boss 5 Captain: ఈ వారం ‘బిగ్ బాస్’ కెప్టెన్ అతడే.. ప్రోమోలో ఇది గమనించారా?

బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఈ రోజు విడుదలైన ప్రోమోలోనే ఈ విషయం లీకైంది.

‘బిగ్ బాస్’లో ఈ వారం హౌస్‌లో కెప్టెన్ స్థానం కోసం పోటీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కెప్టెన్సీ పోటీదారులుగా రవి, జెస్సి, శ్వేతావర్మ, శ్రీరామచంద్ర ఎంపికైనట్లు గురువారం విడుదల చేసిన మొదటి ప్రోమోలో చూపించారు. ఈ నలుగురు స్విమ్మింగ్ పూల్ నుంచి కెప్టెన్ అనే ఇంగ్లీష్ లెటర్స్‌ని తీసుకుని పేర్చే విధంగా ‘స్విమ్ జర స్విమ్’ టాస్క్‌లో పాల్గొన్నారు. 

అయితే, మధ్యాహ్నం విడుదల చేసిన రెండో ప్రోమోలో మాత్రం.. కెప్టెన్ ఎవరనేది లీకైపోయింది. బిగ్‌బాస్‌ను గమనించే ప్రేక్షకులు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసి.. ఇదిగో ఇతడే కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ కెప్టెన్ ఎవరయ్యరో మీకు తెలుసుకోవాలని ఉందా? మరెవ్వరో కాదు.. జెస్సీ. ఫస్ట్ లవ్ గురించి బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో జస్సీ బెలూన్ పట్టుకున్నప్పుడు, సోఫాలో లోబో, సిరిలతో కూర్చున్నప్పుడు జెస్సీ కుడి చేతికి కెప్టెన్సీ బాండ్ కనిపించింది. దీంతో అంతా జస్సీ కెప్టెన్ అయ్యాడని డిసైడ్ అయిపోయారు. ప్రోమో ఎడిట్ చేసినవారు.. ఈ చిన్న విషయాన్ని ఎలా మరిపోయారో అంటూ నెటిజనులు చలోక్తులు విసురుతున్నారు. 

పాత సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్ 5’ సీజన్ మొదటి ఎసిపోడ్ నుంచే సందడి మొదలైంది. మొదటి వారమే గొడవలు, అరుపులు ప్రారంభమైపోయాయి. తాజాగా నేటి ఎపిసోడ్‌‌కు సంబంధించి రెండో ప్రోమో విడుదలైంది. అందులో హౌస్ మేట్లు తమ తొలి ప్రేమను గుర్తు తెచ్చుకుని, వారి గుర్తుగా ఒక ఎర్రటి బెలూన్ పైకొదలాలి. ఆ బెలూన్ పై వారి పేర్లు కూడా రాయాలి. ప్రోమోను బట్టి చూస్తే తొలి ప్రేమ అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by chusara_sirrr_eedi_memesu (@chusara_sirrr_eedi_memesu)

జీవితమనే ప్రయాణంలో ఎందరిని కలిసినా తొలి ప్రేమ ఇచ్చే మధుర అనుభవాలు, నేర్పే గుణపాఠాలు మళ్లీ మళ్లీ దక్కవు అంటూ రెండో ప్రోమోను ప్రారంభించి అందరినీ తొలిప్రేమ జ్ఞాపకాల్లో తడిసి ముద్దయ్యేలా చేశాడు బిగ్ బాస్. శ్రీరామ చంద్ర తన తొలిప్రేమ గురించి చెబుతూ ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని కాసేపు నవ్వించాడు. సన్నీ కూడా తన పదోతరగతి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. షన్ను తన ఫస్ట్ దీపూనేనని, ఆ విషయం ఆమెకు కూడా తెలిసని అన్నాడు. షన్ను ప్రేయసి దీప్తి సునయన గతంలో బిగ్ బాస్ లో పాల్గొంది. జెస్సీ బెలూన్ పై ఒక అమ్మాయి పేరు రాసి ‘నువ్వు సింగిల్ అయితే, నేను రెడీ టు మింగిల్’ అని సిగ్నల్ ఇచ్చాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jessie (@jaswanth__jessie__)

అన్నింటి కన్నా ప్రియా చెప్పిన మాటలే ప్రోమోకి హైలైట్ గా నిలిచాయి. నిజానికి ప్రియకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో పాప గతేడాదే మరణించింది. టీనేజీ వయసున్న కొడుకు ఉన్నాడు. కాగా ప్రోమోలో మాత్రం ప్రియ ‘నేను మ్యారీడా, సెపరేటెడా, డివోర్స్ డా నాకే  తెలియదు’ అని కామెంట్ చేసింది. దీంతో ఆమె వైవాహిక జీవితం ఒడిదొడుకుల్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఆమె బెలూన్ పై ‘కేక్’అని ఇంగ్లిషులో రాసింది. అతనే తన ఫస్ట్ లవ్ అని చెప్పింది. బిగ్ బాస్ 5 సీజన్ ఆరంభ ఎపిసోడ్ లో కూడా నాగార్జునతో ప్రియ తను ఒంటరిగా బతకాల్సి వస్తే ఉండగలనా లేదా టెస్ట్ చేసుకునేందుకు బిగ్ బాస్ కు వచ్చానని చెప్పింది. దానికి నాగార్జున అలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నట్టు అన్నారు.  ఇప్పుడు తాజా ప్రోమోలో ప్రియ మాటలు వింటే ఆమె కాపురంలో కలహాలు ఉన్నట్టు అర్థమవుతోంది. 

ప్రియాంక కూడా తన మొదటి లవ్ తలచుకుని కన్నీటి పర్యంతమైంది. ‘తన బండి వెళ్లిపోతుంటే... ఆ బండి వెనుక పరిగెత్తాను అయినా తను వినలేదు, తన పని తనే చూసుకున్నాడు’ అంటూ ఏడ్చింది. హమీద కూడా ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకుంది. తమ మధ్య బ్రేకప్ అవ్వలేదని, కానీ కలిసి ఉండలేకపోతున్నామంటూ ఎమోషనల్ అయింది. మొత్తమ్మీద ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉండడం ఖాయమనిపిస్తోంది.  

Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్

Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
Embed widget