Anushka: మళ్లీ మొదటికొచ్చిన అనుష్క స్టోరీ - నిర్మాతల పరిస్థితేంటో?
అనుష్క బరువు తగ్గడానికి నిర్మాతలను మరింత సమయం అడిగినట్లు తెలుస్తోంది.

అధిక బరువు సమస్య ఇప్పటికీ అనుష్కను వెంటాడుతూనే ఉంది. చాలా కాలంగా తన బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది అనుష్క. కానీ ఆమె కథ మళ్లీ మొదటికొచ్చిందట. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క బరువు పెరిగింది. అప్పటినుంచి పెరుగుతూనే ఉంది. అందుకే ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. కేవలం బరువు తగ్గడంపైనే దృష్టి పెట్టింది.
అందుకే మీడియా ముందుకు కూడా పెద్దగా రావడం లేదు. మొన్నామధ్య 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీకి మాత్రం వచ్చింది. అప్పుడు కూడా ఆమె లావుగానే కనిపించింది. ఇదిలా ఉండగా.. యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది అనుష్క. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే అనుష్క మాత్రం సెట్ కి రావడం లేదు.
అనుష్కపై తీయాల్సిన సన్నివేశాలను పెండింగ్ లో ఉన్నాయి. దానికి కారణం అనుష్క ఫిట్ గా లేకపోవడమే అని తెలుస్తోంది. తను బరువు తగ్గిన తరువాతే షూటింగ్ కి వస్తానని నిర్మాతలకు చెప్పేసిందట అనుష్క. దీంతో ఆమె అడిగినంత సమయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు మేకర్స్. ఆ మధ్య ఆస్ట్రేలియాలో బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుంది అనుష్క.
కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు సహజమైన పద్దతిలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తోంది అనుష్క. ఆ ప్రాసెస్ కి సమయం పడుతుంది. అందుకే అనుష్క.. నిర్మాతలను టైమ్ అడిగింది. మరో రెండు నెలల వరకు అనుష్క సెట్ కి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈలోగా ఆమె లేని సన్నివేశాలన్నీ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?
Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















