అన్వేషించండి

Ajay Devgn Office: ముంబైలో కొత్త ఆఫీస్ కొనుగోలు చేసిన అజయ్ దేవగన్, ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముంబైలో కొత్త ఆఫీస్ కొనుగోలు చేశారు. మొత్తం 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఆఫీస్ స్పేస్‌ తీసుకున్నారు. దీని కోసం ఆయన భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం.

బాలీవుడ్ లో కొద్ది దశాబ్దాలుగా రాణిస్తున్న నటుడు అజయ్ దేవగన్. నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగానూ రాణిస్తున్నారు. ఆయన సతీమణి కాజోల్ కూడా కొన్ని ఏండ్లుగా హిందీ చిత్ర సీమలో రాణిస్తోంది. అద్భుత సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అజయ్ దేవగన్ రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోనూ నటించి మెప్పించారు. తాజాగా ఈయన ముంబైలో కొత్త ఆఫీస్ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇందుకోసం భారీగా డబ్బు వెచ్చించారు.

రూ. 45 కోట్లతో కొత్త ఆఫీస్ ప్రాపర్టీల కొనుగోలు

ముంబైలోని పశ్చిమ సబర్బ్ అంధేరిలోని ఓషివారా ప్రాంతంలో ఆయన తాజాగా తన కార్యాలయం కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. రెండు వేర్వేరు లావాదేవీలలో ఐదు కార్యాలయ ప్రాపర్టీలను తీసుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ. 45 కోట్ల రూపాయలను వెచ్చించారు. రియల్టీ డెవలపర్ వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ సిగ్నేచర్ నిర్మిస్తున్న బిజినెస్ ప్రాజెక్ట్‌ లో మొత్తం ఐదు ప్రాపర్టీలు రెండు అంతస్తులలో 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మొదటి యూనిట్ 8,405 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకుంటుండగా, ఇది ఓషివారాలోని సిగ్నేచర్ బిల్డింగ్‌లోని 16వ అంతస్తులో ఉంది. దీని విలువ రూ.30.35 కోట్లు. అయితే, అజయ్ స్టాంప్ డ్యూటీగా రూ.1.82 కోట్లు చెల్లించినట్లు సమాచారం. రెండవ యూనిట్ అదే భవనంలోని 17వ అంతస్తులో ఉంది. ఇది 4,893 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనికి రూ.88.44 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్రాపర్టీ ఖర్చు రూ 14.74 కోట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 19, 2023న విశాల్ వీరేందర్ దేవగన్ పేరుతో ఈ ఆస్తులు రిజిస్టర్ చేశారు. అజయ్ అసలు పేరు విశాల్ వీరేందర్ దేవగన్ అనే విషయం తెలిసిందే. అటు ఏప్రిల్ 13న ముంబైలో రూ. 16.5 కోట్ల విలువైన ఇంటిని కాజోల్ కొనుగోలు చేసిన 5 రోజులకే ఈ ప్రాపర్టీ కూడా రిజిస్టర్ కావడం విశేషం. అయితే, ఈ ప్రాపర్టీలకు సంబంధించి అజయ్ దేవగన్ వైపు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

ఇక ప్రస్తుతం అజయ్  స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అజ‌య్ దేవ్‌గ‌న్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇండియ‌న్ ఫుట్‌ బాల్‌ కు స్వ‌ర్ణ‌యుగంగా చెప్పుకునే 1952 నుంచి 62 మ‌ధ్య కాలంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో స్పోర్ట్స్ బ‌యోపిక్‌గా మైదాన్ మూవీ రూపొందింది. ఇందులో భార‌త మాజీ ఫుట్‌బాల్ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ పాత్ర‌లో అజ‌య్ దేవ్‌గ‌న్ కనిపించారు. అటు అభిషేక్ కపూర్ తో కలిసి  మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని, అజయ్ మేనల్లుడు అమన్ దేవగన్‌ తొలి చిత్రంగా రానున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి దర్శకుడిగానూ  వ్యవహరిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

Read Also: నేను పడక గదిలో కూడా అలాగే ఉంటా - కంగనా షాకింగ్ కామెంట్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget