అన్వేషించండి

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

సాయి పల్లవి గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వార్తలు వస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది నటి సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ తన టాలెంట్ తో అతికొద్ది కాలంలోనే లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తన అందం, అభినయంతో పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వార్తలు వస్తున్నాయి. గత కొద్ది కాలంగా సాయిపల్లవి సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ మధ్య కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ అనౌన్స్ చేయకపోవడంతో సాయి పల్లవి సినిమాల నుంచి విరమించుకోవాలి అనుకుంటుందని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 

సాయి పల్లవి మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇటీవల రానా హీరోగా వచ్చిన ‘విరాటపర్వం’ సినిమాలో కనిపించింది. తర్వాత ‘గార్గి’ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రాల తర్వాత సాయి పల్లవి ఏ సినిమాకు సైన్ చేయలేదట, అంతేకాకుండా పెద్ద పెద్ద హీరోలతో ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తుందని సమాచారం. అయితే సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు జార్జియాలో ఎమ్.బి.బి.ఎస్ పూర్తి చేసింది. తర్వాత సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. అప్పటికే డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు పొందడంతో అవకాశాలు కూడా త్వరగానే వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పుడు సినిమాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకుందనే వార్త ఆమె అభిమానులను కలవరపెడుతోంది.

సాయి పల్లవికి బోలెడన్ని సినిమా అవకాశాలున్నాయి. మరి ఇలా ఎందుకు చేస్తుందని ఆరా తీస్తే.. చదువు తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోవడం వల్ల వైద్య వృత్తికి న్యాయం చేయలేకపోయాననే బాధ మనసులో ఉండిపోయిందట. అందుకే కోయంబత్తూర్ లో సొంతంగా ఆసుపత్రి నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ ఆసుపత్రి ద్వారా సాయిపల్లవి, ఆమె చెల్లెలు పూజ కలసి ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నారని వినికిడి. ఇప్పుడా ఆసుపత్రి నిర్మాణం పనులు సాయి పల్లవి దగ్గరుండి చూసుకుంటోందని తెలిసింది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకూ సినిమాల వైపు చూడనని చెప్పిందట. అందుకే పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. తిరస్కరిస్తుందని టాక్. ఆసుపత్రి పూర్తయిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉండి పేషెంట్లకు సేవ చేయాలనుకుంటుందని కూాడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ విషయంపై ఆమె స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే సాయి పల్లవి ఇక సినిమాలకు దూరం అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. మరి దీనిపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Also Read: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget