అన్వేషించండి

Jagan No Reviews : నియోజకవర్గ సమీక్షలు జగన్ ఎందుకు ఆపేశారు ? పార్టీలో సమస్యలు ఎక్కువయ్యాయా ?

కుప్పంతో ప్రారంభించిన నియోజకవర్గాల సమీక్షలను వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ రాజాంతో ఆపేశారు. ఇక నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెప్పడం లేదు. ఆపేయడానికి కారణం ఏమిటి ?

Jagan No Reviews :  ముఖ్యమంత్రి బిజీగా ఉన్న జగన్ మూడేళ్ల కాలంలో పార్టీపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. పార్టీ క్యాడర్‌తో ఆయనకు సంబంధాలు తగ్గిపోయాయి. పాదయాత్రలో ఉన్నప్పుడు.. విపక్షంలో ఉన్నప్పుడు  నేరుగా కార్యకర్తలతో.. ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధాలు ఉండేవి. కానీ సీఎం అయిన తర్వాత అధికార బాధ్యతల వల్ల ఎమ్మెల్యేలకే సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే ఇటీవల నియోజకవర్గాల సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కుప్పంతో ప్రారంభించారు కూడా. కానీ తర్వాత  రాజాం నియోజకవర్గానికి మాత్రం నిర్వహించి ఆపేశారు. మరో నియోజకవర్గ సమీక్ష ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెప్పడం లేదు. 

ప్రతి నయోజకవర్గం నుంచి 50 మందితో సమావేశం కావాలనుకున్న జగన్ ! 
 
ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది ముఖ్య నేతల్ని పిలిపించి జగన్  సమీక్ష నిర్వహించాలనుకున్నారు.  కుప్పం నుంచి ప్రారంభించారు. తొలి సమీక్షలో కుప్పం నుంచి అభ్యర్థిగా భరత్‌ను ఖరారు చేశారు. గెలిపించుకుని తీసుకు వస్తే మంత్రిని చేస్తామన్నారు. తర్వాత రాజాం నియోజకవర్గంలోనూ సమీక్ష చేసి అక్కడి ఎమ్మెల్యే  కంబాల జోగులును మంత్రిని చేస్తానంటూ సీఎం హామీ ఇచ్చారు. అంటే  ఈసారి కూడా అభ్యర్థి కంబాల జోగులేనని దీంతో తేలిపోయిందని ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత సమీక్షలు నిలిచిపోయాయి. నెల దాటిపోయినా మరో నియోజకవర్గం సమీక్, చేయలేదు. నిజానికి   అన్ని నియోజకవర్గాల నేతలతోనూ ఇలా సమావేశం కావడం సాధ్యం కాదు.  ప్రతీ రోజూ ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష పెట్టినా ఆరు నెలల పాటు నిర్విరామంగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నెలకు  రెండే చేయడంతో ఇక చేయరేమో అన్న సందేహాలు వైఎస్ఆర్‌సీపీలో వినిపిస్తున్నాయి. 

పార్టీలో సమస్యలు హైలెట్ అవుతున్నాయని వెనుకడుగు వేస్తున్నారా ? 

కుప్పం, రాజాం నియోజకవర్గల నుంచి ఎంపిక చేసిన యాభై మంది కార్యకర్తలతో జగన్ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయా నియోజకవర్గాల పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమయింది. నియోజకవర్గ సమీక్షలకు కూడా తమకు పిలుపునివ్వలేదని చాలా మంది నేతలు ఫీలయ్యారు. గ్రామానికి ఒక్కరికి కూడా పిలువలేని పరిస్థితుల్లో.. తమకు ప్రాధానయం దక్కడం లేదని పార్టీ కోసం కష్టపడిన వారు ఎక్కువ మంది ఫీలయ్యారు. ఈ కారణంగా సమీక్షల వల్ల అసలు ఉద్దేశం పక్కకు పోయి ... పార్టీ నేతల్లో హైకమాండ్ తమను నిర్లక్ష్యం చేస్తోందన్న అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతోందని భావిస్తున్నారు. అందుకే సమీక్షల విషయంలో పునరాలోచన చేసినట్లుగా చెబుతున్నారు. 

స్థానిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం!

ప్రస్తుతం సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పెద్దగా జరగడం లేదు. అదే సమయంలో బిల్లులూ పెండింగ్‌లో ఉన్నాయి. పలు కార్యక్రమాల్లో మంత్రులు కిందిస్థాయి నేతలకు రావాల్సిన బిల్లుల గురించి బహిరంగంగానే మాట్లాడారు.  రోడ్లు, ఇతర సమస్యల గురించి ప్రస్తావించారు. ఇవన్నీ మీడియాలో హైలెట్ అయ్యాయి. ఇలాంటి సమస్యలను గడప గడపకూ కార్యక్రమం ద్వారా పరిష్కరించిన తర్వాత  .. సమీక్షలు నిర్వహిస్తే బెటరని ప్రభుత్వ పెద్దలు ఆలోచించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏదైనా రెంండు నియోజకవర్గాలతోనే ప్రస్తుతానికి నియోజకవర్గ సమీక్షలు నిలిచిపోయాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget