అన్వేషించండి

Ganta Srinivasa Rao comments: జగన్‌కి బై బై చెప్పాలి, విశాఖ రక్షించుకోవాలి: మాజీ మంత్రి గంటా

Visakha News: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Vizag News: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీకి బైబై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ నగర పరిధిలోని ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. గడిచిన ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేశాడని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి కోరం లేక అసెంబ్లీ వాయిదా వేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్తే కనీసం ముగ్గురు ఎంపీలు కూడా ఆయన వెంట లేరని, సీఎం జగన్ పాలన పట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకుండా ప్రజలు కూడా విసుగెత్తిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బైబై చెప్పాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. 

ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభం

కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా పాలన ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎంతో సమయం పట్టదన్నారు. ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని మరో ప్రభుత్వం కూల్చివేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని గంటా పేర్కొన్నారు. 900కిపైగా హామీలు ఇచ్చి, 15 శాతం కూడా నెరవేర్చలేదని, మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్.. రానున్న ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖ ఒకప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉండేదని, 2014-19 హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఇక్కడే ఉండి పాలన సాగించి ప్రజలకు అండగా నిలిచారన్నారు. అటువంటి గొప్ప నగరాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారని గంటా దుయ్యబట్టారు. మధురవాడలోని ఒక అపార్ట్ మెంట్ లో ఎమ్మార్వో రమణయ్య దారుణంగా చంపేశారని, అధికారులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని గంటా పిలుపునిచ్చారు. 

తెలుగుదేశం జనసేన పార్టీల కాంబినేషన్ సూపర్ హిట్

రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న తెలుగుదేశం, జనసేన పార్టీలది సూపర్, డూపర్ హిట్ కాంబినేషన్ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసిపిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ కు గంటా అభినందనలు తెలియజేశారు. అన్న ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినపుడు అంతా అవహేళన చేశారని, తర్వాత ఆయన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ నిధిని లోకేష్.. టిడిపి కేడర్ కోసం ప్రవేశపెట్టారన్నగంటా.. పార్టీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారంటూ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడు ఉన్నాడని లోకేశ్ నిరూపించారని వెల్లడించారు. ఎన్నికల మ్యాచ్ లో లాస్ట్ మూడు ఓవర్లు మాత్రమే కాదని, లాస్ట్ బాల్ కూడా ఎంతో కీలకమైనదన్నారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా గంటా కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget