అన్వేషించండి

Vijayawada East: విజయవాడ తూర్పున ఉదయించేదెవరో..? టీడీపీ మళ్లీ 'గద్దె'నెక్కేనా? సభలో దేవినేని కుటుంబానికి చోటు దక్కేనా?

Andhra Pradesh Elections : కాంగ్రెస్‌ గడ్డపై పట్టు నిలుపుకునేందుకు తెలుగుదేశం పోరాటం చేస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు గద్దె తహతహలాడుతుండగా...బోణీ చేసేందుకు వైసీపీ ఎదురుచూస్తోంది.

Vijayawada East Assembly Constituency: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తూర్పు నియోజకవర్గాన్ని 1967 నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. విజయవాడ‍(Vijayawada) నగరపాలక సంస్థలోని వార్డులతోపాటు అర్బన్ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్‌(Congress) పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో  తెలుగుదేశం(Telugu Desam) పార్టీ పట్టు సాధించింది. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌(Gadde Rammohan) రెండోసారి ఎమ్మెల్యేగా  ఇక్కడ నుంచే కొనసాగుతున్నారు. 

విజయవాడ తూర్పు ఎవరిదో..?
విజయవాడ తూర్పు(Vijayawada East) నియోజకవర్గం 1967లో ఏర్పాటు చేసినా 2007లో జరిగిన పునర్విభజనలో  పేరు మాత్రం అలాగే ఉంచి...నియోజకవర్గ  స్వరూపం మొత్తం మార్చేశారు. గతంలో కంకిపాడు(Kankipadu) నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ  ఇప్పుడు విజయవాడ తూర్పులో కలిపేశారు. విజయవాడలోని అత్యంత కీలమైన బందర్‌రోడ్డు, ఆటోనగర్‌, మేజర్ కాలనీలు , హెల్త్‌ యూనివర్సిటీలు, కీలకమైన కళాశాలు ఉన్నాయి. 1967లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) తరపున నిల్చున్న తెన్నేటి వి.ఎస్‌.సి.ఆర్  గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ  కాంగ్రెస్ ఈ సీటు నిలబెట్టుకుంది. 1972లో జరిగిన ఎన్నికల్లో దమ్మాలపాటి రామారావు  గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskar Rao)  గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రవ్యాప్తంగా  ఎన్టీఆర్(NTR) గాలి వీచింది. 1983లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అడుసుమిల్లి జయప్రకాశ్‌రావు (Adusumilli Jayaprakash Rao) జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత విజయవాడలో  వరుస హత్యలు, తదనంతర పరిణామాలతో కాంగ్రెస్(Congress) పార్టీలో చేరిన వంగవీటి రంగా(Vangaveeti Ranga)కు 1985లో విజయవాడ తూర్పు టిక్కెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందగా....ప్రత్యర్థుల దాడిలో ఆయన హత్యకు గురయ్యారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో రంగా భార్య రత్నకుమారికి కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించగా...ఆమె విజయం సాధించారు. 1994లో రాష్ట్రవ్యాప్తంగా  తెలుగుదేశం(Telugu Desam) గాలి వీచినా....విజయవాడ తూర్పులో మాత్రం మరోసారి వంగవీటి రత్నకుమారి(Vangaveeti Ratna Kumari) కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీ(BJP)కి కేటాయించడంతో ఆ పార్టీ నుంచి సినీనటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao)  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2004లో జరిగిన ఎన్నికల్లో వంగవీటి రంగా కుమారుడు రాధా(Vangaveeti Radha)కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తండ్రీ, తల్లీ, కుమారుడు ముగ్గురు విజయం సాధించడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కంకిపాడు రద్దవ్వడం...ఆ నియోజకవర్గంలోని చాలా ప్రాంత విజయవాడ తూర్పులో కలవడంతో కాంగ్రెస్‌లో చేరిన దేవినేని నెహ్రూ (Devineni Nehru) విజయవాడ తూర్పు టిక్కెట్ దక్కించుకున్నారు . తెలుగుదేశం నుంచి గద్దెరామ్మోహన్ బరిలో దిగగా...ప్రజారాజ్యం(Prajarajyam) నుంచి టిక్కెట్ సాధించిన యలమంచలి రవి(Yalamanchili Ravi) కేవలం 190 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి గద్దె రామ్మోహన్‌ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వంగవీటి రాధాపై విజయం సాధించారు. 2019 జరిగిన ఎన్నికల్లో రెండోసారి గద్దెరామ్మోహన్ విజయవాడ తూర్పు నుంచి గెలుపొందారు. వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరగా...వైసీపీ టిక్కెట్ బొప్పన భవకుమార్ దక్కించుకున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గద్దెరామ్మోహన్....మరోసారి విజయవాడ తూర్పు నుంచే తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో ఉండగా....తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన మాజీమంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌(Devineni Avinash) ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. గతంలో అవినాష్‌ తండ్రీ ఐదుసార్లు ఇదే ప్రాంతం నుంచి గెలిపొంది ఉండటంతో  నియోజకవర్గ వ్యాప్తంగా దేవినేనికి అనుచరులు ఉండటంతో గెలుపై ఆయన దీమాగా ఉండగా....రెండుసార్లు ఎమ్మెల్యేగా  నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని గద్దె రామ్మోహన్ చెబుతున్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరు గెలిచారు. 

ఎప్పుడు  ఎవరు పార్టీ 
1967 తెన్నేటి వి.ఎస్‌.సి.ఆర్ కాంగ్రెస్‌
1972 దమ్మాలపాటి రామారావు కాంగ్రెస్‌
1978 నాదెండ్ల భాస్కర్‌రావు కాంగ్రెస్‌
1983 అడుసుమిల్లి జయప్రకాశ్‌రావు టీడీపీ
1985 వంగవీటి రంగా కాంగ్రెస్‌
1989 రత్నకుమారి కాంగ్రెస్‌
1994 రత్నకుమారి కాంగ్రెస్‌
1999 కోట శ్రీనివాసరావు టీడీపీ
2004 వంగవీటి రాధా కాంగ్రెస్‌
2009  యలమంచలి రవి ప్రజారాజ్యం
2014 గద్దె రామ్మోహన్‌  టీడీపీ
2019 గద్దె రామ్మోహన్‌  టీడీపీ
మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSKCSK vs SRH Match Highlights IPL 2025  | చెన్నై పై గెలిచి ఆశలు మిగుల్చుకున్న సన్ రైజర్స్CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Embed widget