అన్వేషించండి

ఆ ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి వస్తున్నారా? చంద్రబాబుతో సమావేశం కూడా అయ్యారా!

Three YCP MPs in TDP :అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ముగ్గురు నేతలతో టీడీపీ సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు.

TDP News: అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సదరు ముగ్గురు కీలక నేతలతో టీడీపీ సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. వీరిలో రాజ్యసభ ఎంపీ, వచ్చే ఎన్నికలకు నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ బరిలో దించాలని భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, టీటీడీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్న ప్రశాంతి టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరిద్దరూ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇది వైసీపీ అధినాయకత్వం ఊహించని పరిణామంగానే చెప్పాలి. నెల్లూరు లోక్‌సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నిలిపింది. అయితే, పార్లమెంట్‌ స్థానం పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేయాలంటూ వైసీపీ నాయకత్వానికి ఆయన సూచించారు. కానీ, ఆయన మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడంతో పార్టీకి కొద్ది రోజులు నుచి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజులు కిందట సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా వేమిరెడ్డి ఆయనను కలువకుండా విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారని, టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 

ఆదాల ప్రభాకర్‌ రెడ్డిదీ అదే దారి

ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. ఈయన్ను కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు. అక్కడి నుంచే పోటీ చేస్తారని అధిష్టానం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఆయన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ, ఈయన టీడీపీలోకి వెళ్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ పుకార్లను ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే ప్రచారం జరుగుతోంది. 

ఆర్థికంగా అత్యంత బలమైన వ్యక్తి కావడంతో టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించిన ముఖ్య నాయకులు ఈ మేరకు ఆదాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆదాల టీడీపీలో చేరిక ఎంత వరకు వాస్తమో తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయన ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించలేదు. కానీ, గడిచిన రెండు, మూడు రోజులు నుంచి ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండడంతో నెల్లూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

మాగుంట దారి అటే

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరిక దాదాపు ఖాయమైనట్టే చెబుతున్నారు. వైసీపీ అధిష్టానం మాగుంటకు టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు టికెట్‌ ఇప్పించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. కానీ, ఆయనకు సీటు ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించలేదు. ఒకానొక దశలో బాలినేని తీవ్ర అలకబూనారు. పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. కానీ, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి బాలినేనితో మాట్లాడిన తరువాత ఇక్కడ వివాదాలు సద్దుమణిగాయి. వైసీపీలో టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మాగుంట టీడీపీలో చేరే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఒకేసారి ముగ్గురు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలో చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ అయింది. అయితే, నెల్లూరు ఎంపీలు ఇద్దరూ టీడీపీలో చేరతారా..? లేదా..? అన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో, పార్టీ వర్గాల్లో మాత్రమే ఆ ఇద్దరి ఎంపీల చేరికపై ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఆ ఇరువురు నేతలు, వారి అనుచరులు గానీ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పడం లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
West Bengal Election 2026: బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!
బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget