అన్వేషించండి

ఆ ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి వస్తున్నారా? చంద్రబాబుతో సమావేశం కూడా అయ్యారా!

Three YCP MPs in TDP :అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ముగ్గురు నేతలతో టీడీపీ సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు.

TDP News: అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సదరు ముగ్గురు కీలక నేతలతో టీడీపీ సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. వీరిలో రాజ్యసభ ఎంపీ, వచ్చే ఎన్నికలకు నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ బరిలో దించాలని భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, టీటీడీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్న ప్రశాంతి టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరిద్దరూ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇది వైసీపీ అధినాయకత్వం ఊహించని పరిణామంగానే చెప్పాలి. నెల్లూరు లోక్‌సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నిలిపింది. అయితే, పార్లమెంట్‌ స్థానం పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేయాలంటూ వైసీపీ నాయకత్వానికి ఆయన సూచించారు. కానీ, ఆయన మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడంతో పార్టీకి కొద్ది రోజులు నుచి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజులు కిందట సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా వేమిరెడ్డి ఆయనను కలువకుండా విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారని, టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 

ఆదాల ప్రభాకర్‌ రెడ్డిదీ అదే దారి

ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. ఈయన్ను కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు. అక్కడి నుంచే పోటీ చేస్తారని అధిష్టానం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఆయన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ, ఈయన టీడీపీలోకి వెళ్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ పుకార్లను ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే ప్రచారం జరుగుతోంది. 

ఆర్థికంగా అత్యంత బలమైన వ్యక్తి కావడంతో టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించిన ముఖ్య నాయకులు ఈ మేరకు ఆదాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆదాల టీడీపీలో చేరిక ఎంత వరకు వాస్తమో తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయన ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించలేదు. కానీ, గడిచిన రెండు, మూడు రోజులు నుంచి ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండడంతో నెల్లూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

మాగుంట దారి అటే

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరిక దాదాపు ఖాయమైనట్టే చెబుతున్నారు. వైసీపీ అధిష్టానం మాగుంటకు టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు టికెట్‌ ఇప్పించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. కానీ, ఆయనకు సీటు ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించలేదు. ఒకానొక దశలో బాలినేని తీవ్ర అలకబూనారు. పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. కానీ, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి బాలినేనితో మాట్లాడిన తరువాత ఇక్కడ వివాదాలు సద్దుమణిగాయి. వైసీపీలో టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మాగుంట టీడీపీలో చేరే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఒకేసారి ముగ్గురు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలో చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ అయింది. అయితే, నెల్లూరు ఎంపీలు ఇద్దరూ టీడీపీలో చేరతారా..? లేదా..? అన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో, పార్టీ వర్గాల్లో మాత్రమే ఆ ఇద్దరి ఎంపీల చేరికపై ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఆ ఇరువురు నేతలు, వారి అనుచరులు గానీ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
TGEAPCET: తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
TGEAPCET: తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Lokesh And Anvesh : బెట్టింగ్ యాప్‌లపై అన్వేష్‌కు లోకేష్ రిప్లై - యాంటీ బెట్టింగ్ పాలసీ తెస్తామని హామీ  !
బెట్టింగ్ యాప్‌లపై అన్వేష్‌కు లోకేష్ రిప్లై - యాంటీ బెట్టింగ్ పాలసీ తెస్తామని హామీ !
Camera Dog In IPL: ఐపీఎల్‌ గ్రౌండ్‌లో 'కెమెరా డాగ్‌' - ఆసక్తి పెంచిన సరికొత్త టెక్నాలజీ
ఐపీఎల్‌ గ్రౌండ్‌లో 'కెమెరా డాగ్‌' - ఆసక్తి పెంచిన సరికొత్త టెక్నాలజీ
Heatstroke Emergency Care : సన్​స్ట్రోక్, డీహైడ్రేషన్​తో కళ్లు తిరిగి పడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
సన్​స్ట్రోక్, డీహైడ్రేషన్​తో కళ్లు తిరిగి పడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Embed widget