అన్వేషించండి

Telangana Election Schedule: సార్వత్రిక సమరానికి సిద్ధం - తెలంగాణలో మారిన రాజకీయ చిత్రం, ప్రజల తీర్పు ఎటువైపో?

Telangana News: లోక్ సభ ఎన్నికలు, ఏపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేయనుంది. ఈ క్రమంలో తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులను ఓసారి చూస్తే..

Telangana Political Situation Due to Election Schedule: కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను శనివారం ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పొలిటికల్ హీట్ నెలకొనగా.. ఈసీ ప్రకటనతో ఇక అసలైన ఎన్నికల హడావుడి మొదలు కానుంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ చేస్తున్నాయి. ఓటరన్నను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలతో మమేకమవుతూ.. ఎక్కువ ఓట్లు రాబట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. కాగా, తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల బీఆర్ఎస్ అధికారానికి ఫుల్ స్టాప్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం 'హస్త'గతం చేసుకుంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ప్రస్తుతం పార్టీల బలాబలాలు, పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే..

వంద రోజుల 'ప్రజాపాలన'

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి శుక్రవారంతో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. తొలి రోజే 'ప్రగతి భవన్' గేట్లను తొలగించి.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్ఫష్టం చేసిన సీఎం.. ఆ దిశగా అడుగులు వేశారు. 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి వాటిని తొలి రెండు రోజుల్లోనే అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు. ఓవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూనే.. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తనదైన రీతిలో పాలనను గాడిన పెడుతున్నారు.

ఓ వైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. ఇటు లోక్ సభ సమరానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో ఇప్పుడు మరింత ఫోకస్ తో 17 ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. వంద రోజుల్లో తాము చేసిన మంచిని ప్రజలకు వివరిస్తూ ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేలా సభల్లోని ప్రచారాల్లో కొత్త పంథాతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ కచ్చితంగా రిపీట్ అయ్యేలా ఫోకస్ చేస్తున్నారు. 

ప్రతిపక్ష బీఆర్ఎస్..

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకు పరిమితమైంది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించారు. గెలిచే అవకాశాలున్న వారికే ఈసారి ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు. ఈసారి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి 2 సీట్లు కేటాయించారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీల అమల్లో లోపాలను ప్రజల్లోకి  బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ, ఇతర హామీలను అమలు చేయాలనే డిమాండ్ ను బలంగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారాన్ని ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవాలనే ఉపయోగిస్తుందని ఆరోపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి మళ్లీ పుంజుకోవాలని భావిస్తోన్న గులాబీ పార్టీ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

బీజేపీ ఫోకస్

అటు, బీజేపీ సైతం తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. 17 స్థానాల్లో 10 స్థానాలకు పైగా విజయం సాధించేలా ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేసింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించి కమలం శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు. ప్రధాని మోదీ సైతం శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఎక్కువ ఎంపీ స్థానాల్లో విజయం సాధించేలా బీజేపీ అభిమానులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 3 రోజులు ప్రధాని తెలంగాణలోనే పర్యటించనున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన, బీఆర్ఎస్ హయాంలో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఓ దశలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందనే రాజకీయ విశ్లేషకుల భావన. మరి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Embed widget