అన్వేషించండి

Chandrababu: ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి మళ్లీ చంద్రబాబు- మార్చి 6 నుంచి సభలు

Chandrababu Praja Galam Sabha: ఈనెల ఆరో తేదీ నుంచి మరో సరికొత్త కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగలం పేరుతో ప్రజల్లోకి వెళ్ళనున్నారు.

Chandrababu plans for Praja Galam Sabha From March 6 : తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ విశ్రాంతి ఎరుగక పార్టీ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఈనెల ఆరో తేదీ నుంచి మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాగలం పేరుతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. మార్చి ఆరో తేదీన ప్రారంభం కానున్న ఈ సభలు వరుసగా ఐదు రోజులుపాటు ఐదు ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ ఏర్పాటు చేస్తోంది. ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న ఈ సభల్లో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఐదు రోజులపాటు భారీ ఎత్తున ప్రజాగలం కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. 

వైసీపీ బలమైన స్థానాలపై గురి

ప్రజాగలం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసిపి బలంగా ఉన్న స్థానాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి బలమైన స్థానాలను లక్ష్యంగా చేసుకొని ఈ సభలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ ను ఉత్తేజితం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభ విజయవంతమైందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మరో వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కూటమికి వస్తున్న ప్రజాధరనను కొనసాగించే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాలుపంచుకునేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. బిజెపి కూడా కూటమిలో చేరితే ప్రజాగళం సభల్లో బిజెపి నాయకులు కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదలిరా సభలు ఈ నెల నాలుగో తేదీతో రాప్తాడులో ముగియనున్నాయి. ఒక్కరోజు విరామం తీసుకుని ఆరో తేదీ నుంచి ప్రజాగళం కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. 

నంద్యాలలో తొలి కార్యక్రమం

ప్రజాగళం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమం కర్నూలు జిల్లా నంద్యాలలో తొలిరోజు ఏర్పాటు చేయబోతున్నారు. ఉదయం కర్నూలులో పూర్తయిన వెంటనే మధ్యాహ్నం మైదుకూరులో మరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున ప్రజలు వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ కేడర్ కు ముఖ్య నాయకుల నుంచి సమాచారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 25 పార్లమెంటు స్థానాల పరిధిలో నిర్వహించిన రా కదలిరా సభలు విజయవంతం కావడంతో.. ప్రజా గళం కార్యక్రమాన్ని కూడా అంతే స్థాయిలో విజయవంతం చేయడంపై పార్టీ నాయకులు దృష్టి సారించారు. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఆయా అభ్యర్థులు భారీ ఎత్తున జనాలను సమీకరించేలా పార్టీ అధినాయకత్వం వారికి ఆదేశాలను జారీ చేసింది. ప్రజాగళం సభల తరువాత ఆయా ప్రాంతాల్లో పార్టీ మైలేజీ ఒక్కసారి పెరిగేలా వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి సభల్లోను అక్కడ నెలకొన్న సమస్యలను ఎలుగెత్తి చాటడంతోపాటు తాము అధికారంలోకి వస్తే వాటిని ఎలా పరిష్కరిస్తామన్న విషయాలను కూడా చంద్రబాబు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Honda Dio 125 కొనబోతున్నారా? స్టాండర్డ్, X ఎడిషన్, DLX వేరియంట్ల ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు
హోండా డియో 125 స్కూటర్‌ వేరియంట్లు, ధరలు ఇవే - ఏ మోడల్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
Embed widget