అన్వేషించండి

BJP With TDP: ఆరు ఎంపీ సీట్ల కోసం బీజేపీ పట్టు- అమిత్‌షా చంద్రబాబు చర్చల తర్వాత లెక్క కుదురినట్టేనా..?

Chandrababu talk with Amit shah : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమిత్‌ షాతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుమారు గంటపాటు చర్చించారు.

Chandrababu Alliance With BJP: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన బీజేపీ.. ఒక్కసారిగా టీడీపీ, జనసేన కూటమిలో చేరేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఢిల్లీకి బీజేపీ అధినాయకత్వం పిలిపించింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలు తరువాత అమిత్‌ షాతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుమారు గంటపాటు చర్చించారు. వీరితోపాటు ర్చల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు ఏం చర్చించుకున్నారన్న దానిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. కానీ, రాష్ట్రంలో బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న సీట్లు, పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. 

సీట్ల లెక్క తేలినట్టేనా..?

అమిత్‌ షా, జేపీ నడ్డాతో బుధవారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటేంత వరకు చర్చలు జరిపిన చంద్రబాబు.. బయటకు వచ్చిన తరువాత కూడా వివరాలను వెల్లడించలేదు. గురువారం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చలు విషయాలను పవన్‌ కల్యాణ్‌కు వివరించనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. బీజేపీ కోరుకున్న సీట్లను టీడీపీ, జనసేన ఇస్తాయా..? లేదా..? అన్న దానిపై ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.

ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్టు 20 ఎమ్మెల్యే, ఆరు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలను బీజేపీ అగ్ర నాయకులు చంద్రబాబును అడిగారా..? ఇంకేమైనా ప్రతిపాదనలు పెట్టారా..? అన్నది తేలాల్సి ఉంది. విశాఖ, అరకు, ఏలూరు, రాజమండ్రి, విజయవాడతోపాటు రాయలసీమలో ఓ ఎంపీ స్థానాన్ని బీజేపీ అడుగుతోందని టాక్ నడుస్తోంది. ఇక్కడ ఎవరెవరు పోటీ చేయాలో కూడా ఆ పార్టీ లిస్ట్‌ టీడీపీ ముందు పెట్టి మాట్లాడుతోందని అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఏం చెప్పారనేది మాత్రం టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన లేదు. 

దేశంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలను పెంచుకునే ఉద్ధేశంలో బీజేపీ అగ్రనాయకత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఏపీలో పొత్తుకు సిద్ధపడినట్టు చెబుతున్నారు. బీజేపీ అడిగిన సీట్లపై చంద్రబాబు ముఖ్య నాయకులతో చర్చించి తెలియజేస్తామని చంద్రబాబు చెప్పి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై టీడీపీ ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా వీరి మధ్య జరిగింది. దేశంలో 400 సీట్లను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమిత్‌ షా ఈ సందర్భంగా చంద్రబాబుకు చెప్పినట్టు చెబుతున్నారు. 

పొత్తులపై ఫైనల్‌ నిర్ణయం

రాష్ట్రంలో పొత్తులు, ఆయా పార్టీలు పోటీ చేయబోయే స్థానాలపై గురువారం ఫైనల్‌ నిర్ణయం వెలువడే అవకాశముంది. బీజేపీ పెద్దలు నుంచి పిలుపు రావడంతో పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళుతున్నారు. ముందుగా పవన్‌ కల్యాణ్‌ బీజేపీ ముఖ్య నాయకులతో ఒంటరిగా సమావేశం కానున్నారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి మరోసారి బీజేపీ అగ్ర నాయకులతో కలిసి చర్చిస్తారు. ఈ సందర్భంగా సీట్ల పంపకాలపై స్పష్టత రానుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిపారు. పొత్తు అవసరం, ఇతర అంశాలను నేతలకు చంద్రబాబు వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Embed widget