అన్వేషించండి

UP Election 2022: 'కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి వాళ్లిద్దరూ చాలు- మేం ఏం చెయ్యక్కర్లేదు'

UP Election 2022: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి బయట వ్యక్తులు ఎవరు అవసరం లేదని.. రాహుల్, ప్రియాంక గాంధీ చాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి రాహుల్, ప్రియాంక గాంధీ చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఏఎన్ఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హిజాబ్ సహా పలు వివాదాస్పద అంశాలపై యోగి తనదైన స్టైల్‌లో స్పందించారు.

" కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఆ ఇద్దరు అన్నాచెల్లెళ్లు (రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) చాలు. ఇంకెవరూ అక్కర్లేదు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలను నేను ఒక్కటే ప్రశ్న అడిగాను. బేకార్ కాంగ్రెస్‌కు మీరు ఎందుకు మద్దతిస్తున్నారు అని ప్రశ్నించాను.                                                 "
-యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం

హిజాబ్‌పై

కర్ణాటకలో మొదలై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన హిజాబ్‌ వివాదంపై యోగి ఆదిత్యనాథ్ తనదైన రీతిలో స్పందించారు.

" ప్రధాని నరేంద్ర మోదీ.. ముమ్మారు తలాక్‌ చట్టాన్ని రద్దు చేశారు. దీని ద్వారా మా ముస్లిం కూతుళ్లకు వారి హక్కులు దక్కాయి. అంతేకాదు సమాజంలో వారు కోరుకుంటోన్న గౌరవం కూడా వచ్చింది. కనుక అందరూ గౌరవంగా బతకాలంటే.. వ్యవస్థ, పాలన రాజ్యాంగం చెప్పినట్లు నడవాలి.. షరియత్‌ చట్టాలు చెప్పినట్లు కాదు.                                                       "
-యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం

వాళ్లు తినేశారు

ఉత్తర్‌ప్రదేశ్‌ను గతంలో పాలించిన సమాజ్‌వాదీ, బహుజన్‌సమాజ్ పార్టీలపైనా యోగి విమర్శనాస్త్రాలు సంధించారు. 

" సమాజ్‌వాదీ పాలనలో ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని ఆ పార్టీ గూండాలే తినేశారు. మరోవైపు మాయావతి ఏనుగు(బీఎస్​పీ ఎన్నికల చిహ్నం) పొట్ట చాలా పెద్దది. దానికి ఎంతైనా తక్కువే.                                                         "
-యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం

Also Read: UP Election 2022: 'ఆ పాలకులు యూపీని కొల్లగొట్టారు- అందుకే ప్రజలు వెళ్లగొట్టారు'

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget