అన్వేషించండి

Andhra Election Results 2024 : కూటమిగా మారడం - స్మూత్‌గా ఓట్ల బదిలీ ! ఇదే అసలు గేమ్ ఛేంజర్ !

NDA Alliance Victory : జగన్ వ్యతిరేకులంతా ఓ వైపు కూటమిగా మారితే .. తల్లిని కూడా దూరం చేసుకున్న జగన్ ఒంటరిగా మారారు. ఆ ఫలితమే ఈ ఘోర పరాజయం. కూటమి ఓట్ల బదిలీ సాఫీగా సాగిపపోవడం విజయంలో ప్రధాన పాత్ర.

NDA Alliance Victory in Andhra Elections :   చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జోస్యం చెప్పారు. చంద్రబాబు దురదృష్టం ఏమిటో కానీ ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా పరాజయం పాలయ్యారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా పరాజయం పాలయ్యారు అది వేరే విషయం. కానీ గెలిచినప్పుడల్లా పొత్తులు ఉన్నాయి. అప్పట్లో మోదీ చెప్పింది నిజమైంది. కానీ 2024 నాటికి మళ్లీ పొత్తులతో తెరపైకి వచ్చారు.  భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

కూటమిగా ఏర్పడటమే టీడీపీకి కీలకం  

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  పొలిటికల్ వ్యూహాల గురించి మాటల్లో చెప్పలేం. గెలుస్తారా.. ఓడుతారా అన్న దానితో సంబంధం లేకుండా క్లాస్ పాలిటిక్స్ చేయడంలో ఆయన స్టైలే వేరు. తన క్లాస్ ను ఏపీ ఎన్నికల్లో మరోసారి చూపించారు. బీజేపీ, జనసేనతో  పొత్తులు పెట్టుకోడమే కాదు...ఓట్లు ఈజీగా ట్రాన్స్ ఫర్ అయ్యే వాతావరణం తీసుకు వచ్చారు.  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మూడు పార్టీలు ప్రతిపక్షంగానే ఉన్నప్పటికీ భిన్నమైన అభిప్రాయాలతో పోరాడాయి. ఎన్నికలకు ఏడాది ముందు జనసేన పార్టీ ఓట్ల చీలిక జరగనివ్వబోమని చెబుతూ ముందుకు వచ్చినప్పటి నుండి పరిస్థితి మారింది. కూటమిగా మారిన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన సానుభూతిపరులుగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న అనేక మంది కూటమికి వ్యతిరేకంగా మాట్లాడారు. తక్కువ సీట్లు తీసుకున్నారని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య దూషణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక బీజేపీ పూర్తిగా వేరే ట్రాక్‌లో ఉండేది. ఆ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఉండేవారు. అందుకే ఆ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది పెద్ద పజిల్ గా ఉండేది. 

చెప్పి మరీ కొట్టిన పవన్ కల్యాణ్- పవర్ సునామీ తలుపులు తడితే అలానే ఉంటుంది!

స్మూత్‌గా ఓట్ల  బదిలీ జరిగేలా వ్యూహం 
                       
ఏపీలో ఎన్డీఏ కూటమి ఓట్ల బదిలీ జరిగితేనే మంచి ఫలితాలు సాధిస్తుందని మూడు పార్టీల నేతలకూ తెలుసు.  బీజేపీ ఆరు లోక్ సభ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో  పోటీ చేసింది. జనసేన రెండు పార్లమెంట్, ఇరవై  ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాయి.  టీడీపీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. అంటే..  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ చోటా మూడు పార్టీలపై ఓటర్లలో స్పష్టమన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో గాజు గ్లాస్ గుర్తు గందరగోళం కూడా వచ్చింది. కానీ ఒక్క సారి ప్రచారం ప్రారంభించిన తర్వాత ఎలాంటి సమస్యలు కనిపించలేదు. స్మూత్ గా ప్రచారం చేసుకుపోయారు. మూడు పార్టీల మధ్య వివాదాలు సృష్టించాలని వైసీపీ వైపు నుంచి కొన్ని వ్యూహాలు అమలయ్యాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం విషయంలో అనేక పుకార్లు కూడా రేపారు. అయితే ఏదీ  నిలబడలేదు. అంతా సాఫీగా సాగిపోయింది. 

కసితో పని చేసిన కూటమి పార్టీలు
                      
కోస్తా జిల్లాల్లో ఓట్ల బదిలీ ఎంత పర్ ఫెక్ట్ గా జరిగింతో ఫలితాలు చూస్తే అర్థమైపోతుంది.  ఎంత  బాగా కలసిపోతే అంత బాగా ఫలితాలు వస్తాయనే   విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రచారం ఉమ్మడిగా సాగింది. ప్రతి మూడు రోజులకు ఓ సారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు. కూటమిలో ఏ గుర్తుకు ఓటు వేసినా తమ అభిమాన పార్టీకి వేసినట్లే అన్న అభిప్రాయాన్ని వంద శాతం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పాటు మూడు సభలు, ఓ రోడ్ షోలో పాల్గొన్నారు. పార్టీలు పూర్తిగా కలసిపోయాయన్న గట్టి నమ్మకాన్ని ఓటర్లలో కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ప్రచారం పూర్తయ్యే సరికి అన్ని పార్టీల కార్యకర్తలు పూర్తి స్థాయిలో కలిసిపోయారు. బరిలో ఉన్నది తమ పార్టీ అభ్యర్థా కాదా అన్నది చూసులేదు..   కూటమి అభ్యర్థి కోసం పోటీ పడాలన్నదే లక్ష్యంగా పని చేశారు. అనుకున్న ఫలితం సాధించారు. 

25కుపైగా స్థానాల్లో జగన్‌ టీంను దెబ్బ తీసిన షర్మిల జట్టు- కాంగ్రెస్‌పై సిక్కోలు వాసులకు ఎందుకంత కసి!

కలసికట్టుగానే ఎలక్షనీరింగ్ 
                
ఎలక్షనీరింగ్ అత్యంత కీలకం.  . ఈ విషయంలో కూటమిలో అన్ని   పార్టీల కన్నా.. టీడీపీపై ఎక్కువ బాధ్యత తీసుకుంది.   ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామ స్థాయిలో క్యాడర్ ఉన్న పార్టీ టీడీపీనే. జనసేన పార్టీకి అంతర్గత నిర్మాణం లేదు. బీజేపీకి క్యాడరగ్ తో పాటు కార్యకర్తలూ తక్కువే అందుకే ఈ పార్టీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ బాధ్యతలు టీడీపీనే  తీసుకుంది.  జనసేన సానుభూతిపరుల్ని పూర్తి స్థాయిలో ఓటింగ్ కు వచ్చేలా చూసుకుంది.  ఈ విషయంలో చంద్రబాబు తనదైన మార్క్ చూపించారు.  కూటమికి భారీ విజయాలు ఖాయమ్యాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!

వీడియోలు

Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
Sabarimala gold theft case: శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
Mahindra XUV 7XO ప్రోస్‌ అండ్‌ కాన్స్‌: ఈ SUV మీకు సరిపోతుందా? మీ డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?
Mahindra XUV 7XO ప్లస్‌లు-మైనస్‌లు: కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Embed widget