అన్వేషించండి

Ap Elections 2024: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల పాట్లు - ప్రలోభాలకు తెర తీస్తున్నారా?

Andhra News: పోలింగ్ దగ్గర పడుతున్న వేళ పార్టీల నేతలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ప్రచారం ముసుగులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Political Parties Trying To Woo Voters In Chittor: ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది ఓటు. ఐదేళ్లకోసారి తమకు నచ్చిన.. తాము మెచ్చిన నాయకుడికి జనం ఓట్లేసి గెలిపించి అధికారం అప్పగిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు నానా పాట్లు పడుతుంటారు. తాము అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల వర్షం గుప్పిస్తుంటారు. అలాగే, పోలింగ్ సమయంలో ఓటర్లకు డబ్బులు పంచేందుకు కూడా వెనుకాడరు. ఉమ్మడి చిత్తూరు (Chittor) జిల్లాలో వివిధ పార్టీల నేతలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బు, వస్తువులు, మద్యం ఇలాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా వైసీపీ, మరో వైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో హోరాహోరీ పోటీ నెలకొనగా.. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు శతవిధాలా నేతలు ప్రయత్నిస్తున్నారు. 

ప్రలోభాలకు తెర లేపారా.?

రాష్ట్రంలో మే 13న (సోమవారం) పోలింగ్ జరగనున్న తరుణంలో ఎన్నికల ప్రచారం 11వ తేదీ (శనివారం)  రాత్రికే పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. అయితే, ప్రచారం ముగిసే లోపు ప్రలోభాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని ఆయా పార్టీల నాయకులు కింద స్ధాయి క్యాడెర్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల వారీగా వారికి నగదు పంపిణీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. 

పట్టణాలపై తొలుత దృష్టి

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో తొలుత డబ్బు పంపిణీ చేసే కార్యక్రమానికి పార్టీల నాయకులు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ప్రదానంగా ప్రచార ముసుగులో డబ్బు పంపిణీ జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు అక్కడి పరిస్థితిని బట్టి పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 11 నుంచి 12 లోపు పంపిణీ చేసేలా ఇప్పటికే కార్యాచరణ సైతం ముగిసిందని కొందరు నాయకులు చెబుతున్న మాట.

తనిఖీలు జరుగుతున్నాయా.?

ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనల ప్రకారం ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా రూ.50 వేలకు మించి ఎవరి వద్ద అయినా ఉంటే అందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఆధారాలు లేకపోతే పోలీసులు ఆ నగదు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ వారికి అప్పగించాలి. సంబంధిత వ్యక్తి ఆధారాలు చూపించకపోతే కేసు నమోదు చేస్తారు. ఇందుకు రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు, పట్టణాల సరిహద్దుల్లో పోలీస్, సెబ్ ఇతర విభాగాల అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయని.. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తే డబ్బు సీజ్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే,  ఇంతమంది ఓటర్లకు పంచేందుకు స్థానిక నేతలకు డబ్బు ఎలా వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ఎవరిదగ్గరైనా ఇంత డబ్బు ఉంటే తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంకా తనిఖీలు విస్తృతం చేసి ఓటర్లుకు ప్రలోభాలను అడ్డుకోవాలని పలువురు ఎన్నికల అధికారులను కోరుతున్నారు.

Also Read: Andhra Pradesh News: లోకేష్‌ అడ్డాలో సీఎం జగన్ భారీ సభ- 57 నెలలకే ప్రభుత్వం గొంతు పిసికేస్తున్నారని ఆవేదన

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Embed widget