అన్వేషించండి

చేపల పులుసుతో కారుమూరికి మంత్రి పదవి! ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు

MLC Vamsikrishna made sensational comments about Karumuri : మంత్రి కారుమూరు నాగేశ్వరరావు చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mlc Vamsikrishna Made Sensational Comments About Karumuri : మంత్రి కారుమూరు నాగేశ్వరరావు చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసారని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కెలికితే చేపల పులుసు కథ బయట పెడతానని ఆయన హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వస్తున్నాయని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కొంత మంది మంత్రులు తమ పొత్తులు గురించి మాట్లాడుతున్నారు అంటే భయపడుతున్నట్టే అర్థమన్నారు.  

కాపులు అమాయకులని ఒక మంత్రి అంటున్నారుని, త్వరలో కాపులు అమాయకులో, కాదో తెలియజేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తి గతంగా మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వంశీ స్పష్టం చేశారు. కాపులంత కూటమికి ఓటేయడానికి డిసైడ్ అయ్యారన్న వంశీ.. అభ్యర్థులను కాకుండా పవన్ కళ్యాణ్ ని చూసి మాత్రమే ఓటు వేస్తారని స్పష్టం చేశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందని అంటున్నారని, తీసుకున్న సీట్లుపై పవన్ కళ్యాణ్ కి క్లారిటీ వుందన్నారు. సీట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే వుంటామని జన సైనికులు చెబుతున్నారని, కాపు కార్పొరేషన్ కి ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పాలని వైసీపీ నాయకులను ఆయన డిమాండ్ చేశారు. 

40 రోజుల్లో ప్రభుత్వానికి నూకలు

నలబై రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీసీలకి పెద్ద పీఠ వేశామని చెప్పడం దారుణమని4, 56 కార్పొరేషన్లకి ఒక్క రూపాయి ఇచ్చారా అని వంశీ ప్రశ్నించారు. చైర్మన్ పదవులను ఇచ్చి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. యాదవ కార్పొరేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి బీసీలకు ఏదో చేశామని చెబుతున్నారని, యాదవ్ కులాలకు ఓడిపోయే సీట్లు మాత్రమే ఇచ్చి బలి పశువులను చేశారన్నారు. బిల్డింగ్ ఓపెనింగ్ కి యాదవ కార్పొరేషన్ చైర్మన్ ని పిలిచారా..? అని ప్రశ్నించిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. పిలిస్తే ఆయన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక కేవలం జీతాలు ఇస్తున్నారని, నిధులు మాత్రం లేవన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనను వ్యక్తిగతంగా మాట్లాడారని, హుస్సేన్ సాగర్ లో బుద్ద విగ్రహం అంటూ జగన్ మోహన్ రెడ్డిని తిట్టి మంత్రి అయిన వ్యక్తి తన గురించి మాట్లాడం ఏమిటని ప్రశ్నించారు. చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావని, అమ్మగారికి చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను కెలికితే ఊరుకునేది లేదని, చేపల పులుసు కథ బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ ఎంవీవీ కోటి రూపాయలు ఇస్తానన్నాడని, అతను ఇచ్చినా యాదవులు తీసుకోరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచే పోటీ చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Rapido Driver Selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
Embed widget