అన్వేషించండి

చేపల పులుసుతో కారుమూరికి మంత్రి పదవి! ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు

MLC Vamsikrishna made sensational comments about Karumuri : మంత్రి కారుమూరు నాగేశ్వరరావు చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mlc Vamsikrishna Made Sensational Comments About Karumuri : మంత్రి కారుమూరు నాగేశ్వరరావు చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసారని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కెలికితే చేపల పులుసు కథ బయట పెడతానని ఆయన హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వస్తున్నాయని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కొంత మంది మంత్రులు తమ పొత్తులు గురించి మాట్లాడుతున్నారు అంటే భయపడుతున్నట్టే అర్థమన్నారు.  

కాపులు అమాయకులని ఒక మంత్రి అంటున్నారుని, త్వరలో కాపులు అమాయకులో, కాదో తెలియజేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తి గతంగా మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వంశీ స్పష్టం చేశారు. కాపులంత కూటమికి ఓటేయడానికి డిసైడ్ అయ్యారన్న వంశీ.. అభ్యర్థులను కాకుండా పవన్ కళ్యాణ్ ని చూసి మాత్రమే ఓటు వేస్తారని స్పష్టం చేశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందని అంటున్నారని, తీసుకున్న సీట్లుపై పవన్ కళ్యాణ్ కి క్లారిటీ వుందన్నారు. సీట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే వుంటామని జన సైనికులు చెబుతున్నారని, కాపు కార్పొరేషన్ కి ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పాలని వైసీపీ నాయకులను ఆయన డిమాండ్ చేశారు. 

40 రోజుల్లో ప్రభుత్వానికి నూకలు

నలబై రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీసీలకి పెద్ద పీఠ వేశామని చెప్పడం దారుణమని4, 56 కార్పొరేషన్లకి ఒక్క రూపాయి ఇచ్చారా అని వంశీ ప్రశ్నించారు. చైర్మన్ పదవులను ఇచ్చి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. యాదవ కార్పొరేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి బీసీలకు ఏదో చేశామని చెబుతున్నారని, యాదవ్ కులాలకు ఓడిపోయే సీట్లు మాత్రమే ఇచ్చి బలి పశువులను చేశారన్నారు. బిల్డింగ్ ఓపెనింగ్ కి యాదవ కార్పొరేషన్ చైర్మన్ ని పిలిచారా..? అని ప్రశ్నించిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. పిలిస్తే ఆయన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక కేవలం జీతాలు ఇస్తున్నారని, నిధులు మాత్రం లేవన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనను వ్యక్తిగతంగా మాట్లాడారని, హుస్సేన్ సాగర్ లో బుద్ద విగ్రహం అంటూ జగన్ మోహన్ రెడ్డిని తిట్టి మంత్రి అయిన వ్యక్తి తన గురించి మాట్లాడం ఏమిటని ప్రశ్నించారు. చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావని, అమ్మగారికి చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను కెలికితే ఊరుకునేది లేదని, చేపల పులుసు కథ బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ ఎంవీవీ కోటి రూపాయలు ఇస్తానన్నాడని, అతను ఇచ్చినా యాదవులు తీసుకోరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచే పోటీ చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget