అన్వేషించండి

జనసేనకు మలి విడతలో ఉత్తరాంధ్రలో దక్కే సీట్లు ఎన్నో?

How many seats Janasena get in Uttarandhra: ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి 94 మంది, జనసేన పార్టీలో ఐదుగురు పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడతలో ప్రకటించబోయే స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

How Many Seats Will Janasena Get In Uttarandhra In The Second Phase : రానున్న సార్వత్రిక ఎన్నికలకు కూటమిగా బరిలో దిగుతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను శనివారం (ఫిబ్రవరి 24న) ఉదయం విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి 94 మంది, జనసేన పార్టీలో ఐదుగురు పేర్లు ఉన్నాయి. మొత్తంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాలు పొత్తులో భాగంగా ఇస్తున్నట్టు స్పష్టత వచ్చింది.

తొలి జాబితాలో ప్రకటించిన ఐదు స్థానాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి రెండే సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఒకటి కాగా, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ స్థానం మరొకటి ఉంది. ఈ నేపథ్యంలో రెండో విడతలో ప్రకటించబోయే స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగిలిన 19 సీట్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎన్ని సీట్లు ఉంటాయన్న ఉత్సుకత సర్వత్రా నెలకొంది. ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. వీరికి సీట్లు దక్కుతాయా..? లేదా..? అన్న చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. 

ఈ నేతలకు సీట్లు దక్కేనా..?

టీడీపీ, జనసేన కూటమి రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఐదు సీట్లకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 సీట్లకు అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తారన్న ఆసక్తి ఇప్పుడు జనసేన కేడర్‌తోపాటు నాయకుల్లో నెలకొంది. ఇప్పటికే పలువురు ఆశావహులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ జాబితా విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. కొద్దిరోజులు కిందట జనసేన పార్టీలో చేరి నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, ఆ పార్టీ సీనియర్‌ నేత బొలిశెట్టి సత్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షుడిగా పని చేసి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, సీనియర్‌ నేతలు సుందరపు విజయ్‌ కుమార్‌, సుందరపు సతీష్‌ కుమార్‌ తదితర నేతలు ఉన్నారు. వీరంతా రెండో జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

ఎంపీ బరిలో నాగబాబు..?

అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి మెగా బ్రదర్‌ నాగబాబు బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు కేటాయించారు. ఇక్కడ అత్యధికంగా ఉండే కాపు, గవర ఓటర్లను బ్యాలెన్స్‌ చేసే ఉద్ధేశంతో అసెంబ్లీ స్థానాన్ని కొణతాలకు కేటాయించారు. పార్లమెంట్‌ స్థానాన్ని కాపు సామాజికవర్గానికి చెందిన నాగబాబు కేటాయించడం ద్వారా ఇరు వర్గాలకు చేరువ కావాలని జనసేన భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే నాగబాబు పోటీ చేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానికంగా నివాసం ఉండేందుకు అనుగుణంగా ఇంటిని కూడా సిద్ధం చేసుకున్నారు. కొద్దిరోజుల్లోనే నాగబాబు ఇక్కడకు పూర్తిగా మకాం మార్చనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
West Bengal Election 2026: బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!
బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget