అన్వేషించండి

జనసేనకు మలి విడతలో ఉత్తరాంధ్రలో దక్కే సీట్లు ఎన్నో?

How many seats Janasena get in Uttarandhra: ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి 94 మంది, జనసేన పార్టీలో ఐదుగురు పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడతలో ప్రకటించబోయే స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

How Many Seats Will Janasena Get In Uttarandhra In The Second Phase : రానున్న సార్వత్రిక ఎన్నికలకు కూటమిగా బరిలో దిగుతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను శనివారం (ఫిబ్రవరి 24న) ఉదయం విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి 94 మంది, జనసేన పార్టీలో ఐదుగురు పేర్లు ఉన్నాయి. మొత్తంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాలు పొత్తులో భాగంగా ఇస్తున్నట్టు స్పష్టత వచ్చింది.

తొలి జాబితాలో ప్రకటించిన ఐదు స్థానాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి రెండే సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఒకటి కాగా, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ స్థానం మరొకటి ఉంది. ఈ నేపథ్యంలో రెండో విడతలో ప్రకటించబోయే స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగిలిన 19 సీట్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎన్ని సీట్లు ఉంటాయన్న ఉత్సుకత సర్వత్రా నెలకొంది. ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. వీరికి సీట్లు దక్కుతాయా..? లేదా..? అన్న చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. 

ఈ నేతలకు సీట్లు దక్కేనా..?

టీడీపీ, జనసేన కూటమి రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఐదు సీట్లకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 సీట్లకు అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తారన్న ఆసక్తి ఇప్పుడు జనసేన కేడర్‌తోపాటు నాయకుల్లో నెలకొంది. ఇప్పటికే పలువురు ఆశావహులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ జాబితా విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. కొద్దిరోజులు కిందట జనసేన పార్టీలో చేరి నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, ఆ పార్టీ సీనియర్‌ నేత బొలిశెట్టి సత్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షుడిగా పని చేసి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, సీనియర్‌ నేతలు సుందరపు విజయ్‌ కుమార్‌, సుందరపు సతీష్‌ కుమార్‌ తదితర నేతలు ఉన్నారు. వీరంతా రెండో జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

ఎంపీ బరిలో నాగబాబు..?

అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి మెగా బ్రదర్‌ నాగబాబు బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు కేటాయించారు. ఇక్కడ అత్యధికంగా ఉండే కాపు, గవర ఓటర్లను బ్యాలెన్స్‌ చేసే ఉద్ధేశంతో అసెంబ్లీ స్థానాన్ని కొణతాలకు కేటాయించారు. పార్లమెంట్‌ స్థానాన్ని కాపు సామాజికవర్గానికి చెందిన నాగబాబు కేటాయించడం ద్వారా ఇరు వర్గాలకు చేరువ కావాలని జనసేన భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే నాగబాబు పోటీ చేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానికంగా నివాసం ఉండేందుకు అనుగుణంగా ఇంటిని కూడా సిద్ధం చేసుకున్నారు. కొద్దిరోజుల్లోనే నాగబాబు ఇక్కడకు పూర్తిగా మకాం మార్చనున్నారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
Embed widget