అన్వేషించండి

Malkajgiri MP Seat : మల్కాజిగిరి సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ, సీటు తనదేనంటూ ప్రచారం స్టార్ట్ చేసేసిన మైనంపల్లి

వచ్చే నెలలో  పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. రెండు నెలల క్రితమే తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో నాడు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలుఎంపీ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు.

Malkajgiri Parliament Seat: వచ్చే నెలలో  పార్లమెంటు ఎన్నికల (Loksabha Elections)షెడ్యూల్ విడుదల కాబోతోంది. రెండు నెలల క్రితమే తెలంగాణ (Telangana)లో  అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections)ముగియడంతో...నాడు కాంగ్రెస్ ( Congress) పార్టీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలు మళ్ళీ ఎంపీ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొందరు నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు. బీఆర్ఎస్, బీజేపీలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు...కాంగ్రెస్ పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్‌ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్లతో పాటు జూనియర్లలో  పలువురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పదుల సంఖ్యలో అభ్యర్థులు...ఎవరికి వారు సీటు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు తామే అభ్యర్థులమని చెప్పుకుంటూ ప్రచారం ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన మైనంపల్లి హనుమంతరావు...ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి ఎంపీ టికెట్ తనకేనని ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. 

ప్రచారం స్టార్ట్ చేసిన మైనంపల్లి హనుమంతరావు
మల్కాజిగిరి సీటుపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయకపోయినప్పటికీ...మైనంపల్లి మాత్రం ఒకడుగు ముందుకు వేశారు. మల్కాజ్ గిరి పార్లమెట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒక వైపు మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ కొనసాగుతుండగా.. మరోవైపు తండ్రి ఎంపీ సీటు కోసం లాబీయింగ్ చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో వందలాది వాహనాల శ్రేణితో మైనంపల్లి హనుమంతరావు బలప్రదర్శన చేశారు. ఇటీవలే జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రాంమోహన్, ఆయన భార్య చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి ...ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానంటూ రేవంత్‌రెడ్డి వద్ద ప్రస్తావించారు. 

రేవంత్ రెడ్డి సోదరులు ప్రయత్నాలు
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరికి టిక్కెట్ కచ్చితంగా దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారని ప్రచారం సాగుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇరువురు అన్నదమ్ములు అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొన్నారు. సోదరుడి వారసత్వం కొనసాగించేలా మల్కాజిగిరి ఎంపి టికెట్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ వారసులను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల ద్వారా రేవంత్ రాజకీయ వారసులు క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టికెట్ కావాలంటోన్న ఓడిన నేతలు

మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం ప్రతిపక్ష పార్టీలో కూడా విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థులు కూడా తమకు మరో అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ లేదు. దీంతో మల్కాజిగిరి ఎంపీ సీటుపైనే పలువురు నేతలు దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం ఎవరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందో వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget