అన్వేషించండి

Fact Check: జనాలని మోసం చేశానన్న ఏపీ సీఎం జగన్ వీడియోలో వాస్తవం ఇదీ

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ప్రజల్ని మోసం చేశానని చెప్పారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి సీఎం జగన్ ప్రతిపక్ష కూటమి గురించి వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాక్ట్ చెక్
ఒరిజినల్ వీడియోలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు.

క్లెయిమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశాను అని ఒప్పుకుంటున్న వీడియో అని క్లైమ్ చేస్తూ ఒక 16 సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరగనున్నాయని తెలిసిందే.

“ఈ ఎన్నికలలో మీ బిడ్డ, మీ బిడ్డ ఒక్కడు, అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి,” అని జగన్ అనటం మనం వినవచ్చు. ఈ క్లిప్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ ఇక్కడ  చూడవచ్చు.  

Fact Check: జనాలని మోసం చేశానన్న ఏపీ సీఎం జగన్ వీడియోలో వాస్తవం ఇదీ

సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్ షాట్ (Source: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే ఇది ఎడిటెడ్ వీడియో. ఒరిజినల్ వీడియోలో జగన్ ప్రతిపక్ష కూటమిని విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలో తెలుగుదేశం పార్టీ, జన సేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి.

ఆ వీడియోపై ఏం తెలిసింది.. 

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకుగా ఒరిజినల్ వీడియో మాకు లభించింది. ఏప్రిల్ 19, 2024 నాడు కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వీడియో ఇది. ఈ సభని సాక్షి చానల్ లైవ్ స్ట్రీమ్ చేసింది. వైరల్ వీడియోలో కూడా సాక్షి లోగో చూడవచ్చు.

ఈ ఒరిజినల్ వీడియోలో జగన్ 22:55 నుండి 23:21 మధ్య చేసిన వ్యాఖ్యలని క్రాప్ చేసి, వేరే చోట్ల యాడ్ చేసి వీడియోని వైరల్ చేశారు.

ఈ భాగంలో సీఎం జగన్, “ఈ ఎన్నికలలో ఇంటింటికీ మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, కూటమిగా వారందరూ కూడా ఏకం అయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు, తోడేళ్ళు అనేక మంది,” అని చెప్పటం మనం వినవచ్చు.

ఈ భాగంలో నుండి “మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి” అనే భాగాన్ని క్రాప్ చేసి, తన గురించి తాను మాట్లాడుతున్న భాగంలోకి జొప్పించి, తాను ప్రజలని మోసం చేశానని ఒప్పుకుంటున్నట్టుగా వైరల్ వీడియోని చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో, తాను ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఇటువంటి అనేక ఎడిటెడ్ వీడియోలని లాజికల్లీ ఫ్యాక్ట్స్ డీబంక్ చేసింది. వాటిల్లో కొన్నింటిని ఇక్కడ ఇక్కడ  చదవొచ్చు. 

 వాస్తవం (Fact) 
ఎడిటెడ్ వీడియో క్లిప్ షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశానని ఒప్పుకున్నారని క్లైమ్ చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో తను ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారణ అయింది. 

This story was originally published by Logicallyfacts, as part of the Shakti Collective. Except for the headline, excerpt and opening introduction para, this story has not been edited by ABP Desam staff. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget