అన్వేషించండి

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

హుజూరాబాద్‌లో ఓటుకు టీఆర్‌ఎస్‌ ఆరువేలు ఇచ్చిందని.. మునుగోడులో కూడా ఇస్తుందన్నారు ఈటల. ఈ నెలరోజుల పాటు దావత్‌లు నడుస్తాయని తర్వాత పట్టించుకున్న వాళ్లే ఉండబోరన్నారు.

కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ రూపంలో పుస్తెలు కట్టడానికి 2 వేల కోట్లు ఇచ్చి... పుస్తెలు తెంచి 45 వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. భూలోకంలో నరకాన్ని అనుభవించి వచ్చిన వాడినన్నారు. కెసిఆర్ అనే యమధర్మ రాజు తనకు 6 నెలల నరకం అనే శిక్ష వేశాడని... 6 నెలలు కొట్లాడి.. ప్రజల ఆశీర్వాదంతో బయటపడ్డానన్నారు.  

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం అడవితుమ్మలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్... టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రచారంలో భాగంగా పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. సర్పంచ్‌ల పరిస్థితి సుంకరి వాళ్ళకంటే హీనంగా తయారైందన్నారు ఈటల. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో చాలా మంది ప్రజలకు పింఛన్లు వచ్చాయన్ని తెలిపారు. కొందరికి గొర్రెలు వచ్చాయన్నారు. 4 ఏళ్ల కింద డిడి కట్టిన వారికి కూడా రాని గొర్రెలు ఇప్పుడు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.  

గత ఎన్నికల్లో కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు 3116 నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వలేదన్నారు ఈటల. లక్ష రూపాయల లోపు రుణం ఏకకాలంలో మాఫీ అని మోసం చేశారన్నారు. బ్యాంక్‌ల దృష్టిలో రైతులు దొంగలుగా చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. 

ఉపఎన్నికలు అయిపోయిన తర్వాత కేసీఆర్‌ దొరకరని... ఇప్పుడే అన్ని పనులు చేయించుకోవాలన్నారు ఈటల. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎటుపాయే అని నిలదీశారు. అర్హులందరికీ 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని లేదంటే డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. 

రైతు బంధు, పెన్షన్, కళ్యాణలక్ష్మి అన్నీ కలిపితే 26 వేలకోట్లు అవుతాయన్నారు ఈటల. కానీ మందుపోసి కేసీఆర్ వసూలు చేస్తున్న డబ్బు 45 వేల కోట్లని లెక్క చెప్పారు. జనాలు మద్యం తాగి తాగి బానిసలు అవుతున్నారన్నారు. భార్య కూలికి పోయి సంపాదించుకొని వచ్చిన డబ్బులు కూడా లాక్కొని తాగుతున్న వారు అన్నీ ఊర్లలో ఉన్నారన్నారు. కెసిఆర్ సంపద వెనుక తెగిన కళ్యాణ లక్ష్మీ పెళ్లి కూతుళ్ల తాళిబొట్లు ఉన్నాయన్నారు. పుస్తెలు కట్టడానికి 2 వేల కోట్లు ఇచ్చి.. పుస్తెలు తెంచి 45 వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారన్నారు. 

హుజూరాబాద్‌లో 6 వేల రూపాయలు ఒక్కో ఓటుకు ఇచ్చారన్నారు. మునుగోడులో కూడా మీ పాత అప్పులు అన్నీ పోతాయని... నెల రోజుల పాటు దావత్‌ ఉంటుందన్నారు ఈటల. కెసిఆర్ బానిసలు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బీజేపీని గెలిపించండని పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget