అన్వేషించండి

ఏపీలో బీజేపీ పోరుబాట-ఈ నెల 27న ఏలూరులో భారీ బహిరంగ సభ

BJP Public Meeting In Eluru : రాష్ట్రంలో బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. ఈ నెల 27న బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది.

BJP News: ఏపీలో బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. ఒకపక్క బీజేపీ అధిష్టానం టీడీపీ, జనసేనతో పొత్తు చర్చలను సాగిస్తుండగా, రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 27న బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏలూరులో ప్రజా పోరు పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ సభకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నారు. ఈ సభకు హాజరయ్యే రాజ్‌నాథ్‌ సింగ్‌ క్లస్టర్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఏలూరు, కాకినాడ, అమలాపురం జిల్లాల పరిధిలోని బీజేపీ నాయకులు, బూత్‌ కమిటీ సభ్యులతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సభ నిర్వహించనున్న స్థలాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ప్రధాన కార్యదర్శి గారాపాటి సీతారామాంజనేయ చౌదరి తదితరులు పరిశీలించారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణకు బీజేపీ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. 

ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు

సభ వేదికగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశముంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు వైఫల్యాలపై సభ వేదికగా విమర్శలు గుప్పించనున్నారు. ప్రధానంగా మద్యపాన నిషేదం, రైతులను ఆదుకునేందుకు మూడు వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన ధరల స్థిరీకరణ నిధి వంటి అంశాలను ప్రశ్నిస్తూ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశముంది. అదే సమయంలో గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి చేసిన మేలు, ఆర్థికంగా అందించిన సహకారం తదితర అంశాలను ప్రజలకు సభా వేదికగా తెలియజేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సహకారాన్ని అందించిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్‌నాథ్‌ కేడర్‌కు సబా వేదికగా సూచించే అవకాశముంది. 

స్పష్టత వచ్చేనా

బీజేపీ ఏలూరులో నిర్వహిస్తున్న సభ కంటే ముందుగానే పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. పొత్తుపై స్పష్టత వచ్చే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను సభా వేదికగా పరిచయం చేసే అవకాశముంది. పొత్తుపై స్పష్టత రాకపోతే మాత్రం బీజేపీ విధానాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు, విమర్శలకు సభలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేత హాజరవుతున్న సభ కావడంతో రాజకీయంగాను ప్రాధాన్యత సంతరించుకుంది. కనీసం రెండు లక్షల మందితో సభను నిర్వహిస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Assembly Elections 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
CM Revanth Reddy: పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
West Bengal Elections: ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Dacoit First Review: డెకాయిట్ ఫస్ట్ రివ్యూ... సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటంటే?
డెకాయిట్ ఫస్ట్ రివ్యూ... సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటంటే?
Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Vishwambhara Release Date : మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్? - ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడినట్లేనా...
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్? - ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడినట్లేనా...
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
Madhubala Biopic : మధుబాల బయోపిక్‌లో యంగ్ హీరోయిన్... సాయి పల్లవి బదులుగా?
మధుబాల బయోపిక్‌లో యంగ్ హీరోయిన్... సాయి పల్లవి బదులుగా?
MP Viral News: ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
Embed widget