అన్వేషించండి

ఏపీలో బీజేపీ పోరుబాట-ఈ నెల 27న ఏలూరులో భారీ బహిరంగ సభ

BJP Public Meeting In Eluru : రాష్ట్రంలో బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. ఈ నెల 27న బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది.

BJP News: ఏపీలో బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. ఒకపక్క బీజేపీ అధిష్టానం టీడీపీ, జనసేనతో పొత్తు చర్చలను సాగిస్తుండగా, రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 27న బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏలూరులో ప్రజా పోరు పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ సభకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నారు. ఈ సభకు హాజరయ్యే రాజ్‌నాథ్‌ సింగ్‌ క్లస్టర్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఏలూరు, కాకినాడ, అమలాపురం జిల్లాల పరిధిలోని బీజేపీ నాయకులు, బూత్‌ కమిటీ సభ్యులతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సభ నిర్వహించనున్న స్థలాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ప్రధాన కార్యదర్శి గారాపాటి సీతారామాంజనేయ చౌదరి తదితరులు పరిశీలించారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణకు బీజేపీ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. 

ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు

సభ వేదికగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశముంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు వైఫల్యాలపై సభ వేదికగా విమర్శలు గుప్పించనున్నారు. ప్రధానంగా మద్యపాన నిషేదం, రైతులను ఆదుకునేందుకు మూడు వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన ధరల స్థిరీకరణ నిధి వంటి అంశాలను ప్రశ్నిస్తూ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశముంది. అదే సమయంలో గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి చేసిన మేలు, ఆర్థికంగా అందించిన సహకారం తదితర అంశాలను ప్రజలకు సభా వేదికగా తెలియజేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సహకారాన్ని అందించిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్‌నాథ్‌ కేడర్‌కు సబా వేదికగా సూచించే అవకాశముంది. 

స్పష్టత వచ్చేనా

బీజేపీ ఏలూరులో నిర్వహిస్తున్న సభ కంటే ముందుగానే పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. పొత్తుపై స్పష్టత వచ్చే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను సభా వేదికగా పరిచయం చేసే అవకాశముంది. పొత్తుపై స్పష్టత రాకపోతే మాత్రం బీజేపీ విధానాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు, విమర్శలకు సభలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేత హాజరవుతున్న సభ కావడంతో రాజకీయంగాను ప్రాధాన్యత సంతరించుకుంది. కనీసం రెండు లక్షల మందితో సభను నిర్వహిస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget