అన్వేషించండి

YSRCP News: నేడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక భేటీ

CM Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం కీలక భేటీకి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

Andhra Pradesh News:  ఏపీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం కీలక భేటీకి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం సీఎంవో కార్యాలయంతోపాటు పార్టీ ఆఫీస్‌ నుంచి అందింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు విజయవాడకు చేరుకున్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై సీఎం జగన్‌ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా, నిర్ధేశం చేసే అవకాశముంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాంధ్రలో మొత్తంగా 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వైసీపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ కూడా వైసీపీతోనే అనుబంధంగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలకు మాత్రమే సమావేశం అవుతున్నారా..? ఇన్‌చార్జ్‌లు కూడా వస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. 

అత్యవసర భేటీ దేనికి సంకేతం..?

సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు 11 జాబితాల్లో అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇప్పటికే మరో వందకుపైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో మెజార్టీ స్థానాలు ఉత్తరాంధ్రకు చెందినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు సంబంధించి ఏమైనా చర్చిస్తారా..? లేక ఉత్తరాంధ్రకు సంబంధించిన గడిచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యేలకు వివరించడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. రానున్న ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎమ్మెల్యేలకు సీఎం అందించే అవకాశముందని చెబుతున్నారు. 

దిశా, నిర్ధేశం చేసేందుకేనా

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు సీఎం జగన్‌ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నికలకు సన్నద్ధం చేసే ఉద్ధేశంతోనే ఈ భేటీ జరుగుతున్నట్టు చెబుతున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి కీలకమైన అంశాలపై సీఎం ఎమ్మెల్యేలతో మాట్లాడి దిశా, నిర్ధేశం చేయనున్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ను కలిసేందుకు అవకాశం లేదన్న విమర్శలు పార్టీ నుంచి బయటకు వెళుతున్న వారి నుంచి వస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఉన్న ఇబ్బందులను సీఎం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా వారికి ఉన్న ఇబ్బందులు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను జగన్‌ తెలుసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ భేటీ ఉండే అవకాశముంది.

Also Read: బీజేపీ, టీడీపీ పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? ఇంకా సీట్ల పంచాయితీ తెగలేదా?

Also Read:  పవన్ కల్యాణ్‌ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ కోరుతోందా ? పొత్తల చర్చల్లో ఏం జరుగుతోంది ?

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget