అన్వేషించండి

YSRCP News: నేడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక భేటీ

CM Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం కీలక భేటీకి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

Andhra Pradesh News:  ఏపీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం కీలక భేటీకి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం సీఎంవో కార్యాలయంతోపాటు పార్టీ ఆఫీస్‌ నుంచి అందింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు విజయవాడకు చేరుకున్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై సీఎం జగన్‌ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా, నిర్ధేశం చేసే అవకాశముంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాంధ్రలో మొత్తంగా 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వైసీపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ కూడా వైసీపీతోనే అనుబంధంగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలకు మాత్రమే సమావేశం అవుతున్నారా..? ఇన్‌చార్జ్‌లు కూడా వస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. 

అత్యవసర భేటీ దేనికి సంకేతం..?

సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు 11 జాబితాల్లో అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇప్పటికే మరో వందకుపైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో మెజార్టీ స్థానాలు ఉత్తరాంధ్రకు చెందినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు సంబంధించి ఏమైనా చర్చిస్తారా..? లేక ఉత్తరాంధ్రకు సంబంధించిన గడిచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యేలకు వివరించడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. రానున్న ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎమ్మెల్యేలకు సీఎం అందించే అవకాశముందని చెబుతున్నారు. 

దిశా, నిర్ధేశం చేసేందుకేనా

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు సీఎం జగన్‌ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నికలకు సన్నద్ధం చేసే ఉద్ధేశంతోనే ఈ భేటీ జరుగుతున్నట్టు చెబుతున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి కీలకమైన అంశాలపై సీఎం ఎమ్మెల్యేలతో మాట్లాడి దిశా, నిర్ధేశం చేయనున్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ను కలిసేందుకు అవకాశం లేదన్న విమర్శలు పార్టీ నుంచి బయటకు వెళుతున్న వారి నుంచి వస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఉన్న ఇబ్బందులను సీఎం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా వారికి ఉన్న ఇబ్బందులు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను జగన్‌ తెలుసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ భేటీ ఉండే అవకాశముంది.

Also Read: బీజేపీ, టీడీపీ పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? ఇంకా సీట్ల పంచాయితీ తెగలేదా?

Also Read:  పవన్ కల్యాణ్‌ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ కోరుతోందా ? పొత్తల చర్చల్లో ఏం జరుగుతోంది ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget