అన్వేషించండి

Minister Botsa Satyanarayana : కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు విలీనం, మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Minister Botsa Satyanarayana : రాష్ట్రంలో కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలను మాత్రమే విలీనం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2వ తరగతి వరకూ ప్రాథమిక విద్యా అందిస్తామని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తామన్నారు.

Minister Botsa Satyanarayana : కిలోమీట‌రు ప‌రిధిలో ఉన్న పాఠ‌శాల‌ల‌ను మాత్రమే విలీనం చేయాల‌ని ప్రతిపాదించామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ తెలిపారు. విద్యతోపాటు, మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు. నూత‌న విద్యావిధానం ద్వారా పిల్లల్లో చిన్ననాటి నుంచే మాన‌సిక వికాసాన్ని క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. విజయనగరం జిల్లా  గ‌రివిడి జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌లో రూ.1.28 కోట్లతో నిర్మించిన అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల భ‌వ‌నాన్ని సోమ‌వారం మంత్రి బొత్స ప్రారంభించారు.

Minister Botsa Satyanarayana : కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు విలీనం, మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

2వ తరగతి వరకు ప్రాథమిక విద్య 

ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్యం త‌మ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యతాంశాల‌ని అన్నారు. నూత‌న విద్యావిధానంలో భాగంగా విద్యారంగంలో ప‌లు సంస్కర‌ణ‌ల‌కు ప్రభుత్వం శ్రీ‌కారం చుట్టింద‌ని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దూర‌దృష్టితో ఆలోచించి, విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల‌కు తెర తీశార‌ని చెప్పారు. పిల్లల్లో చిన్నత‌నం నుంచే మ‌నో వికాసాన్ని క‌ల్పించే విధంగా విద్యావిధానాన్ని రూపొందించిన‌ట్లు తెలిపారు. దీనికోస‌మే అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను, ప్రాథమిక పాఠ‌శాల‌ల‌ను క‌లిపి, కార్పొరేట్ విద్యాల‌యాల్లో మాదిరిగా, ఎల్‌కేజీ, యూకేజీ త‌ర‌హాలో చిన్నవ‌య‌సు నుంచే 2వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రాథమిక విద్యను అందించ‌నున్నామ‌ని చెప్పారు. 

ఆ తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం 

3,4,5 త‌ర‌గ‌తుల‌ను ఉన్నత పాఠ‌శాల‌ల్లో విలీనం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నాడు-నేడు ద్వారా రూ.15 వేల కోట్లతో పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే మొద‌టి ద‌శ నాడు-నేడు ప‌నులు దాదాపు పూర్తి చేశామ‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది నుంచి ప్రవేశ‌పెట్టనున్న నూత‌న విద్యావిధానాన్ని ప్రజ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఉపాధ్యాయులు త‌మ‌కు ఏ స‌మ‌స్య ఉన్నా,  చ‌ర్చించ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌ని మంత్రి ప్రక‌టించారు.

ఉద్యోగ సంఘాలతో చర్చలు 

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి బొత్స అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్‌ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. యూటీఎఫ్ నాయకులు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామనడం సబబుకాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీపీఎస్ పై కమిటీ వేశామని మంత్రి తెలిపారు. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందన్నారు. ఈ కమిటీతో మళ్లీ సమావేశం కూడా నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయుల సెలవుల రద్దుపై టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ అవుతుందని తెలిపారు. సోమవారం సాయంత్రం మంత్రులు, జాయింట్‌ స్టాఫ్‌ కమిటీ సభ్యులతో సమావేశం అవుతామన్నారు. 16 ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించామని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
T20 World Cup: భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
Toronto gold heist: ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
The Raja Saab Collections : ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
Embed widget