అన్వేషించండి

Minister Botsa Satyanarayana : కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు విలీనం, మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Minister Botsa Satyanarayana : రాష్ట్రంలో కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలను మాత్రమే విలీనం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2వ తరగతి వరకూ ప్రాథమిక విద్యా అందిస్తామని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తామన్నారు.

Minister Botsa Satyanarayana : కిలోమీట‌రు ప‌రిధిలో ఉన్న పాఠ‌శాల‌ల‌ను మాత్రమే విలీనం చేయాల‌ని ప్రతిపాదించామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ తెలిపారు. విద్యతోపాటు, మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు. నూత‌న విద్యావిధానం ద్వారా పిల్లల్లో చిన్ననాటి నుంచే మాన‌సిక వికాసాన్ని క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. విజయనగరం జిల్లా  గ‌రివిడి జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌లో రూ.1.28 కోట్లతో నిర్మించిన అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల భ‌వ‌నాన్ని సోమ‌వారం మంత్రి బొత్స ప్రారంభించారు.

Minister Botsa Satyanarayana : కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు విలీనం, మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

2వ తరగతి వరకు ప్రాథమిక విద్య 

ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్యం త‌మ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యతాంశాల‌ని అన్నారు. నూత‌న విద్యావిధానంలో భాగంగా విద్యారంగంలో ప‌లు సంస్కర‌ణ‌ల‌కు ప్రభుత్వం శ్రీ‌కారం చుట్టింద‌ని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దూర‌దృష్టితో ఆలోచించి, విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల‌కు తెర తీశార‌ని చెప్పారు. పిల్లల్లో చిన్నత‌నం నుంచే మ‌నో వికాసాన్ని క‌ల్పించే విధంగా విద్యావిధానాన్ని రూపొందించిన‌ట్లు తెలిపారు. దీనికోస‌మే అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను, ప్రాథమిక పాఠ‌శాల‌ల‌ను క‌లిపి, కార్పొరేట్ విద్యాల‌యాల్లో మాదిరిగా, ఎల్‌కేజీ, యూకేజీ త‌ర‌హాలో చిన్నవ‌య‌సు నుంచే 2వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రాథమిక విద్యను అందించ‌నున్నామ‌ని చెప్పారు. 

ఆ తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం 

3,4,5 త‌ర‌గ‌తుల‌ను ఉన్నత పాఠ‌శాల‌ల్లో విలీనం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నాడు-నేడు ద్వారా రూ.15 వేల కోట్లతో పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే మొద‌టి ద‌శ నాడు-నేడు ప‌నులు దాదాపు పూర్తి చేశామ‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది నుంచి ప్రవేశ‌పెట్టనున్న నూత‌న విద్యావిధానాన్ని ప్రజ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఉపాధ్యాయులు త‌మ‌కు ఏ స‌మ‌స్య ఉన్నా,  చ‌ర్చించ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌ని మంత్రి ప్రక‌టించారు.

ఉద్యోగ సంఘాలతో చర్చలు 

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి బొత్స అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్‌ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. యూటీఎఫ్ నాయకులు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామనడం సబబుకాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీపీఎస్ పై కమిటీ వేశామని మంత్రి తెలిపారు. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందన్నారు. ఈ కమిటీతో మళ్లీ సమావేశం కూడా నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయుల సెలవుల రద్దుపై టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ అవుతుందని తెలిపారు. సోమవారం సాయంత్రం మంత్రులు, జాయింట్‌ స్టాఫ్‌ కమిటీ సభ్యులతో సమావేశం అవుతామన్నారు. 16 ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించామని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget