అన్వేషించండి

AUEET 2022 Notification : ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు, ఏయూఈఈటీ 2022 నోటిఫికేషన్ విడుదల

AUEET 2022 Notification : విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏయూఈఈటీ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా ఉన్నాయి.

AUEET 2022 Notification : విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఏయూఈఈటీ(ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్) 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఏయూఈఈటీ 2022 అర్హత పరీక్షను బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. 

బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీలు సీట్లు 

  • సీఎస్ఈ -360
  • మెకానికల్ ఇంజినీరింగ్ -30 
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ - 60 
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ -30 

అర్హతలు, రుసుం 

ఈ పరీక్షకు ఇంటర్మీడియట్(10+2) లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 45% మార్కులు సాధించాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఏయూఈఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎంట్రన్స్ పరీక్ష అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరి రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://aueet.audoa.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు 

  • అప్లై చేసుకోడానికి చివరి తేదీ - జూన్ 22, 2022 
  • హాల్ టికెట్లు డౌన్ లోడ్ తేదీ - జూన్ 28, 2022 
  • ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ - జూన్ 30, 2022 
  • ఫలితాలు ప్రకటన - జులై 2, 2022 
  • అడ్మిషన్లు ప్రారంభం - జులై 8, 2022 
  • ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభమైన తేదీ - మే 22, 2022 

గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లు 

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో డిజిటల్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ MA, B.Com ప్రోగ్రామ్‌లను అందించడానికి విశ్వవిద్యాలయం ఒక ప్రైవేట్ ఎడ్-టెక్ కంపెనీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ పీవీజీడీ రెడ్డి మాట్లాడుతూ ఎంబీఏ, బీబీఏ తదితర కార్యక్రమాలను ఆన్‌లైన్‌, బ్లెండెడ్‌ మోడల్‌లో అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని యూనివర్సిటీ అధికారులను కోరారు. "ఉమ్మడి కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం వివిధ ప్రధాన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటుంది" అని రెడ్డి చెప్పారు.

“ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 70% పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారు. ఉన్నత విద్యను విస్తరించేందుకు ఆన్‌లైన్ విద్య ఉపయోగపడుతుంది. దేశంలోని ఇతర ప్రముఖ సంస్థలతో సమానంగా ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను విస్తరించేందుకు ఆంధ్ర యూనివర్సిటీ సిద్ధమవుతోంది’’ అని వీసీ చెప్పారు. మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష-2022 నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ విడుదల చేసింది. AUEETలోని మెరిట్ విశ్వవిద్యాలయంలోని వివిధ ఇంజినీరింగ్ విభాగాలలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూన్ 22. తాత్కాలిక పరీక్ష తేదీ జూన్ 30. BTech+MTech డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులు నాలుగేళ్ల కోర్సు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ ఫీజుగా ₹10,000 చెల్లించి ఎగ్జిట్ ఆప్షన్‌ను పొందవచ్చు. వారికి బీటెక్ పట్టా అందజేస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget