అన్వేషించండి

EAMCET Counselling: ఎంసెట్(బైపీసి) కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 1 నుంచి 3 వరకు స్లాట్‌ బుకింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నవంబర్‌ 3 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.

తెలంగాణలో ఎంసెట్‌ అగ్రికల్చర్, బీఫార్మసీ స్ట్రీమ్ పరీక్ష రాసిన  ఇంటర్ బైపీసీ విద్యార్థులకు బీఫార్మసీలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం (అక్టోబరు 8న) ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 1 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది.

ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 1 నుంచి 3 వరకు స్లాట్‌ బుకింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నవంబర్‌ 3 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు నవంబరు 3 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దిగ్విజయంగా వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ 9న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు నవంబరు 13 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. 


17 నుంచి తుది విడత కౌన్సెలింగ్..
మొదటివిడతలో సీట్లు పొందలేనివారు తుది విడత కౌన్సెలింగ్ ద్వారా సీటు కోసం ప్రయత్నించవచ్చు. నవంబరు 17 నుంచి ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. నవంబరు 17న ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. నవంబరు 18న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు నవంబరు 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.  వీరికి నవంబరు 22న సీట్లను కేటాయించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు నవంబర్‌ 22 నుంచి 25 వరకు నేరుగా కాలేజీలకు వెళ్లి రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. స్పాట్‌ అడ్మిషన్స్‌కు సంబంధించిన వివరాలను నవంబర్‌ 23న వెల్లడించనున్నారు.


మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

నవంబరు 1 నుంచి 3 వరకు స్లాట్‌ బుకింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు. 
నవంబర్‌ 3 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన.
నవంబరు 3 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.
నవంబర్‌ 9న మొదటి విడత సీట్ల కేటాయింపు.
నవంబరు 13 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌. 


తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు..

నవంబరు 17న ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్.
నవంబరు 18న  ధ్రువపత్రాల పరిశీలన.
నవంబరు 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 
నవంబరు 22న సీట్ల కేటాయింపు. 
నవంబర్‌ 22 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్‌.


 అక్టోబరు 11 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్..
ఎంసెట్(ఇంజినీరింగ్) తుది విడత కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు అక్టోబర్ 11,12 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అక్టోబరు 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, ఆ తర్వాత అక్టోబరు 16న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతాయి.

షెడ్యూలు ఇదే..

అక్టోబర్ 11,12న  రెండో విడత స్లాట్ బుకింగ్
అక్టోబర్ 12న  రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబరు 12,13 తేదీల్లో  రెండో విడత వెబ్ ఆప్షన్లు
అక్టోబరు 16న  రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.


Also Read:

జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు. పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం దరఖాస్తు గడువు ముగిసేనాటికి 392 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అక్టోబరు 30 వరకు పొడిగించారు. ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


NMMS: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine : HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
Brain Storage Capacity: మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Free Online Courses India: ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!
ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget