అన్వేషించండి

TG EAPCET: టీజీ ఎప్‌సెట్ - 2024 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలు ఇవే

EAPCET Counselling: తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్ విభాగానికి సంబంధించిన మొదటి కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 19న ప్రారంభమై.. నవంబరు 12తో ముగియనుంది. ఆ తర్వాత స్పాట్ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు.

TGEAPCET Bi.P.C. Stream Counselling Schedule: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 19 నుంచి 22 వరకు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి అక్టోబరు 21 నుంచి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులకు అక్టోబరు 21 నుంచి 25 వరకు వెబ్‌‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. వీరికి అక్టోబరు 28న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 28 నుంచి 30లోపు సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, నిర్ణీత ట్యూష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా అగ్రికల్చర్‌ విభాగంలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మ్-డీ, బ‌యో టెక్నాల‌జీ, బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

నవంబరు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్..
ఇక సీట్ల భర్తీకి సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కనివారు, కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు న‌వంబ‌ర్ 4న ప్రాసెసింగ్ ఫీజు, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి నవంబరు 5న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌ పూర్తయినవారు నవంబరు 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి న‌వంబ‌ర్ 9న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు న‌వంబ‌ర్ 9 నుంచి 11 లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబరు 11, 12 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి న‌వంబ‌ర్ 12న 'స్పాట్ అడ్మిషన్'కి సంబంధించిన మార్గదర్శకాలు విడుద‌ల కానున్నాయి.  

ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌: అక్టోబరు 19 నుంచి 22 వరకు.

➥ ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబరు 21 నుంచి 23 వరకు.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: అక్టోబరు 21 నుంచి 25 వరకు.

➥ తొలి విడత సీట్ల కేటాయింపు: అక్టోబరు 28న.

➥ సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబరు 28 నుంచి 30 వరకు

తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌: న‌వంబ‌ర్ 4న.

➥ ధ్రువపత్రాల పరిశీలన: నవంబరు 5న.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: నవంబరు 5, 6 తేదీల్లో.

➥ తొలి విడత సీట్ల కేటాయింపు: న‌వంబ‌ర్ 9న

➥ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: న‌వంబ‌ర్ 9 నుంచి 11 వరకు

➥ కాలేజీల్లో రిపోర్టింగ్: నవంబరు 11, 12 తేదీల్లో.

➥ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు: న‌వంబ‌ర్ 12న.

కౌన్సెలింగ్ వెబ్‌సైట్  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget