అన్వేషించండి

TS Inter Education: ఇక ఇంటర్‌లోనూ 'గ్రేడ్' విధానం? ప్రవేశాలకు 'ఆన్‌లైన్' యోచనలో ప్రభుత్వం!

తెలంగాణలో పదోతరగతి తరహాలోనే ఇంటర్‌లోనూ మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేస్తోంది.

తెలంగాణలో పదోతరగతి తరహాలోనే ఇంటర్‌లోనూ మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్‌కూ శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్‌లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తోంది.

ఇంటర్ విద్య ఐక్య కార్యచరణ ఛైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని చెప్పారు. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు ఇంటర్ మార్కుల కంటే జేఈఈ, నీట్ ర్యాంకులు వస్తాయో?రావో? అన్న దానిపైనే అధికంగా ఒత్తిడి ఉంది అని నానో అకాడమీ సంచాలకుడు కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు.

ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ ప్రవేశాలు?
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలను 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా చేపట్టే యోచన చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఇంటర్ ఫలితాల వెల్లడి సందర్భంగా వీరు విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్ ప్రవేశాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు జరుపుతారా అని ప్రశ్నించగా... ఈసారికి పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని, ఆపై వచ్చే విద్యాసంవత్సరంలో ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు యోచిస్తున్నామన్నారు. జూన్ 1 నుంచి ఇంటర్ రెండో సంవత్సరంతో పాటు తొలి ఏడాది విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరలో ప్రవేశాల షెడ్యూల్ జారీ చేస్తామని, మరో నాలుగైదు రోజుల్లో ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్ విధానంలో చేస్తారా అని ప్రశ్నించగా.. దానిగురించి తర్వాత మాట్లాడదామని మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 400 కళాశాలలకు అగ్నిమాపక ఎన్‌ఓసీ లేదని, కాకపోతే వచ్చే విద్యాసంవత్సరం(2023-24) వరకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఆ కళాశాలల్లో చేరే విద్యార్థులు వాటికి ఎన్‌ఓసీ లేదన్న విషయం తెలుసని హామీపత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

పది‌లోనూ ఆన్‌లైన్ మూల్యాంకనం!
పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో కూడా ఆన్‌లైన్ విధానాన్ని (ఆన్‌స్క్రీన్ ఎవాల్యుయేషన్) అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఆలోచన చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. అదనపు జవాబుపత్రాలు తీసుకుంటే ఇంటర్ తరహాలో బుక్‌లెట్‌గా ఇవ్వాలని, ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలంటే అది తప్పనిసరని అన్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget