అన్వేషించండి

ఇంటర్ ఫస్టియర్ మార్కులే సెకండియర్‌కు.. ప్రాక్టికల్స్‌కు 100 శాతం మార్కులు

Inter Second Year results: ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలనే విషయంపై తెలంగాణ విద్యా శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఫస్టియర్ మార్కులే సెకండియర్‌కు వేయాలని నిర్ణయించింది.

ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ విద్యా శాఖ జారీచేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులనే సెకండియర్‌కు కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు (100 శాతం) ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులకు 35 శాతం మార్కులతో పాస్ చేయనున్నట్లు తెలిపింది. 

కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఇస్తారనే అంశంపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను గ్రేడుల విధానంతో నేరుగా సెకండియర్‌లోకి ప్రమోట్ చేయగా.. సెకండియర్ విద్యార్థుల ఫలితాలను ఇంకా వెల్లడించలేదు. తాజాగా సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర విద్యా శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. 

మార్గదర్శకాలు ఇవీ.. 
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో అవే మార్కులను సెకండియర్‌కి పరిగణలోకి తీసుకుంటామని విద్యా శాఖ పేర్కొంది. అంటే అంటే ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని మార్కులు అయితే వచ్చాయో వాటినే సెకండియర్‌కి కూడా వేస్తారు. ప్రాక్టికల్స్ విషయంలోనూ విద్యా శాఖ పలు విధివిధానాలను రూపొందించింది. ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు (100 శాతం) ఇవ్వాలని నిర్ణయించింది. 

ఫస్ట్ ఇయర్‌లో ఏమైనా సబ్జెక్టులు ఫెయిలైన వారిని కూడా 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని విద్యా శాఖ వెల్లడించింది. సాధారణంగా  ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన వారు సెకండియర్ సాధారణ పరీక్షలతో పాటు వీటిని రాస్తారు. కానీ సెకండియర్ పరీక్షలు కూడా రద్దు కావడంతో వీరిని పాస్ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తామని విద్యా శాఖ పేర్కొంది.

నచ్చకపోతే పరీక్షలు రాసుకోవచ్చు..
సెకండియర్ మార్కుల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలు నచ్చకపోతే విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కూడా కల్పిస్తామని విద్యా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా పరిస్థితులు అంతా సర్దుకున్నాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అప్పుడు విద్యార్థులు పరీక్ష రాసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. 

సెకండియర్ ఫలితాలు 
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 28న (సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేయనునున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. . ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కాగా, తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,73,967 మంది ఫీజులు చెల్లించారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 4,28,986 మంది కాగా ఒకేషనల్‌ విద్యార్థులు 44,981 మంది ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Maha Kumbh: ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో  పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
Embed widget