By: ABP Desam | Updated at : 02 Aug 2021 07:53 PM (IST)
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4 నుంచి ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. తెలంగాణలో 82, ఆంధ్రప్రదేశ్ లో 23 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉందని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు. రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తామని వివరించారు. హాల్ టికెట్లపై పరీక్ష కేంద్రం లొకేషన్ ఉంటుందని చెప్పారు. ఒక రోజు ముందుగానే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని సూచించారు.
ఇంటర్ సిలబస్కు వెయిటేజి లేదు..
ఎంసెట్ పరీక్షకు గతంలో ఇంటర్ సిలబస్ వెయిటేజి ఉండేదని కానీ ఈ ఏడాది వెయిటేజీ తొలగించినట్లు గోవర్ధన్ తెలిపారు. కొవిడ్19 కారణంగా ఇబ్బందులు పడిన విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇస్తామని.. అందులో వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందే..
ప్రతి ఒక్క విద్యార్థి కొవిడ్19 నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. వారికి పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఈసారి ఎంసెట్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రశ్నపత్రాలను సైతం సిద్ధం చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీల వివరాలు..
ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్సెట్ పరీక్షలు..
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగాలకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు ఆగస్లు 9, 10 తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. టీఎస్ ఎడ్సెట్ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో జరగనున్నాయి. లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను సైతం ఆగస్టు 23న నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈఏపీసెట్ (AP EAPCET ) పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ఆగస్టులో టీఎస్ ఎడ్సెట్ పరీక్షలు.. ముఖ్యమైన తేదీలివే..
Agri Courses: ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా
GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?
SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>