అన్వేషించండి

TS EAMCET Exam Date 2021: ఈ నెల 4 నుంచి ఎంసెట్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 4 (ఎల్లుండి) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉందని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4 నుంచి ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. తెలంగాణలో 82, ఆంధ్రప్రదేశ్ లో 23 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉందని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు. రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తామని వివరించారు. హాల్ టికెట్లపై పరీక్ష కేంద్రం లొకేషన్ ఉంటుందని చెప్పారు. ఒక రోజు ముందుగానే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని సూచించారు. 

ఇంటర్ సిలబస్‌కు వెయిటేజి లేదు..

ఎంసెట్‌ పరీక్షకు గతంలో ఇంటర్ సిలబస్ వెయిటేజి ఉండేదని కానీ ఈ ఏడాది వెయిటేజీ తొలగించినట్లు గోవర్ధన్ తెలిపారు. కొవిడ్‌19 కారణంగా ఇబ్బందులు పడిన విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇస్తామని.. అందులో వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని సూచించారు.

కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందే..

ప్రతి ఒక్క విద్యార్థి కొవిడ్19 నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. వారికి పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఈసారి ఎంసెట్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రశ్నపత్రాలను సైతం సిద్ధం చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: టీఎస్‌ పీజీఈసెట్‌ నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీల వివరాలు..

ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ పరీక్షలు..

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగాలకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు ఆగస్లు 9, 10 తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో జరగనున్నాయి. లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను సైతం ఆగస్టు 23న నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ (AP EAPCET ) పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also Read: ఆగస్టులో టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు.. ముఖ్యమైన తేదీలివే..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Embed widget