SSC Pre Final Exams: పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?
Tenth Pre Final Exams: పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షల షెడ్యూలును శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది.
![SSC Pre Final Exams: పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే? Telangana 10th Class Pre Final exam Dates 2024 released check schedule here SSC Pre Final Exams: పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/10/64d5b53c995fb376ffc3711b180d3b301707536401265522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TS SSC Pre Final Exams Time Table 2024: పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షల షెడ్యూలును శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం సమయాల్లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఆయాతేదీల్లో మధ్యాహ్నం 1.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 1న తెలుగు, మార్చి 2న హిందీ, మార్చి 4న ఇంగ్లిష్, మార్చి 5న గణితం(మ్యాథమెటిక్స్), మార్చి 6న భౌతిక శాస్త్రం(ఫిజిక్స్), మార్చి 7న జీవశాస్త్రం (బయాలజీ), మార్చి 11న సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షలను నిర్వహించనున్నారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
Telangana SSC Exams 2024: తెలంగాణలో పదోతరగతి పరీక్షలను ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు (TS SSC Exams) నిర్వహించనున్నారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానుండగా.. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పరీక్ష తేదీ | పేపరు |
మార్చి 18 | ఫస్ట్ లాంగ్వేజ్ |
మార్చి 19 | సెకండ్ లాంగ్వేజ్ |
మార్చి 21 | థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) |
మార్చి 23 | మ్యాథమెటిక్స్ |
మార్చి 26 | ఫిజికల్ సైన్స్ |
మార్చి 28 | బయాలజికల్ సైన్స్ |
మార్చి 30 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 1 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు |
ఏప్రిల్ 2 | ఓరియంటెల్ పేపర్-2 |
టెన్త్’ సైన్స్ పరీక్ష రెండు రోజులు..
తెలంగాణలో మార్చి నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. సైన్స్లో ఫిజికల్ సైన్స్(పార్ట్-1), బయలాజికల్ సైన్స్(పార్ట్-2) పేపర్లుగా నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా పదోతరగతిలో ఆరు సబ్జెక్టులు ఉండగా... అందులో అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ (ప్రశ్నపత్రం) ఉంటుంది. సైన్స్లో రెండు పేపర్లు ఉన్నా ఒకే రోజు 15 నిమిషాల వ్యవధి ఇచ్చి ఒకదాని తర్వాత మరొకటి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు గతంలో సర్కారుకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక రోజు అదనంగా పరీక్ష ఉంటే ఆరోజు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి భత్యాలు చెల్లించాల్సి వస్తుందని.. విద్యాశాఖ భావించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ విధానంపై పునరాలోచన చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో అధికారులు తాజాగా పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)