అన్వేషించండి

Pariksha Pe Charcha: నేడు 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం, విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో ఈ రోజు (జనవరి 29) 11 గంటలకు పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Pariksha Pe Charcha 2024 Event: పరీక్షల సమయంలో విద్యార్థుల్లో సహజంగా ఉండే భయాలను, ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు ప్రధాని. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో ఈ రోజు (జనవరి 29) 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.  

ఈ ఏఢాది దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు, పేరెంట్స్, టీచర్లు ఇందులో పాల్గొననున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది.వారికి పీఎం మోదీని కలవడానికి, సంభాషించడానికి అవకాశం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థుల కోసం పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులతోపాటు 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మందికిపైగా తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న బోర్డు పరీక్షల్లో రాణించేందుకు చిట్కాలను కూడా ప్రధాని మోదీ విద్యార్థులతో పంచుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని.. స్వయం ప్రభా యొక్క 32 ఛానెళ్లతోపాటు దూరదర్శన్, వివిధ ప్రభుత్వ వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకం..
యువతకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకం రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో  ప్రధాన మంత్రి ఒత్తిడి లేని ప‌ద్ధతిలో బోర్డు ప‌రీక్షలు, ప్రవేశ ప‌రీక్షల‌ను ఛేదించడానికి చిట్కాలను పంచుకున్నారు. పరీక్షా పే చర్చా-2024 అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శక, అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఎగ్జామ్ వారియర్స్. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఒకచోట చేర్చి, విద్యార్థుల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించే వాతావరణాన్ని పెంపొందించడమే ఈ పుస్తకం ప్రధాన లక్ష్యంగా ఉంది. తమను తాము పూర్తిగా వ్యక్తీకరించడానికి ఇదివేదిక అవుతుంది. ఈ కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ పుస్తకం ద్వారా, ప్రధాన మంత్రి విద్యకు సంబంధించిన కొత్త విధానాన్ని వివరించారు. విద్యార్థుల జ్ఞానం, సమగ్ర అభివృద్ధికి ప్రాథమిక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మితిమీరిన ఒత్తిడి, ఒత్తిడితో పరీక్షలను జీవన్మరణ పరిస్థితిగా మార్చకుండా సరైన దృక్పథంలో ఉంచాలని ప్రధాన మంత్రి ప్రతి ఒక్కరినీ కోరారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ISRO Scientists Resign:ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Embed widget