అన్వేషించండి

NEET UG Scorecard 2024: నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

NEET UG Scorecard: నీట్ యూజీ పరీక్ష రివైజ్డ్ స్కోరుకార్డులు విడుదలయ్యాయి. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు తమ స్కోరుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NEET UG Revised Scorecard 2024 Out: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ యూజీ-2024 పరీక్షకు సంబంధించిన రివైజ్డ్ స్కోరుకార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జులై 25న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డులను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ వివరాలు లేదా ఫోన్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం పరీక్ష కేంద్రాలవారీగా నీట్ యూజీ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా స్కోరుకార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. 

నీట్ యూజీ రివైజ్డ్ స్కోరు కార్డులు ఇలా చూసుకోండి..
➨ నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్‌కార్డ్ కోసం విద్యార్థులు మొదట ఎన్టీఏ అధికారిక‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - exams.nta.ac.in/NEET 
➨ అక్కడ హోంపేజీలో కనిపించే 'Click Here for Revised Score Card' లింక్ మీద క్లిక్ చేయాలి.
➨ విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ వివరాలు లేదా ఫోన్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి SUBMIT బటన్ మీద క్లిక్ చేయాలి.
➨విద్యార్థుల స్కోరు కార్డులు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శమిస్తాయి.
➨ స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

నీట్ యూజీ స్కోరుకార్డుల కోసం క్లిక్ చేయండి..

నీట్‌ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు రావని సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీఏ సవరించిన ఫలితాలను విడుదల చేసింది. దీని ఫలితంగా మెరిట్ జాబితాలో పలు మార్పులు జరిగాయి. జులై 23న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ యూజీ -2024 స‌వరించిన తుది ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా రివైజ్డ్ స్కోరుకార్డులను ఎన్టీఏ విడుదల చేసింది.

విద్యార్థుల ఆందోళనల మధ్య సుప్రీం కోర్టు జోక్యంతో ఐఐటీ-ఢిల్లీ నిపుణుల కమిటీ ఆధారంగా, వివాదాస్పద ప్రశ్నకు ఒక సరైన ఎంపికను మాత్రమే ఆమోదించడం తప్పనిసరి చేసింది. నీట్ యూజీ సవరించిన స్కోర్‌కార్డ్ 2024లో ఈ సర్దుబాటు కార‌ణంగా ఇప్పుడు ఆమోదించబడిన సమాధానాన్ని ఎంచుకున్న దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రభావంతో టాప్ ర్యాంకర్లు సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.  ఈ నిర్ణయంతో 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. సవరించిన ఫలితాలను ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

ఆ ప్రశ్నకు ఒక్కటే సమాధానం..
నీట్‌ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు సరైన సమాధానంపై ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ జులై 23న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కటేనని స్పష్టం చేసింది. సంబంధిత ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో నాలుగోది మాత్రమే సరైన సమాధానం అని ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ తేల్చిందని ధర్మాసనం తెలిపింది. ‘స్టేట్‌మెంట్‌ 1 కరెక్ట్‌.. స్టేట్‌మెంట్‌ 2 కరెక్ట్‌ కాదు’ అని ఆ నాలుగో ఆప్షన్‌ చెబుతున్నదని పేర్కొంది. ఎన్టీఏ కూడా 4వ ఆప్షన్‌నే సరైన సమాధానంగా ఆన్సర్‌ కీలో సవరించాలని తెలిపింది. ప్రశ్న నంబర్‌ 29కు నాలుగో ఆప్షన్‌ మాత్రమే సరైన సమాధానమని తేల్చింది. ఈ నేపథ్యంలోనే సవరించిన ఫలితాల్లో నాలుగు లక్షల మంది 5 మార్కులను కోల్పోవాల్సి వచ్చింది.

నీట్‌-యూజీ పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) జులై 23న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మళ్లి నీట్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ యూజీ-2024 పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్న మాట వాస్తవమేనని.. అయితే దీనివల్ల కేవలం 155 మంది అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందారని కోర్టు తెలిపింది. ఈ కారణంగా మిగతా అభ్యర్థులందరికీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన అసవరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం జులై 23న తీర్పు చెప్పింది. నీట్‌ పేపర్‌ లీకేజీ ద్వారా పరిమిత సంఖ్యలో మాత్రమే అభ్యర్థులు లబ్ధి పొందారని, ఆ లబ్ధిపొందిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల పాలవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget