అన్వేషించండి

JEE Main 2022 Answer Key: జేఈఈ మెయిన్ 2022 సెషన్-2 ఆన్సర్ 'కీ' వచ్చేసింది, ఇలా చెక్ చేసుకోండి!

ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నాన్ రిఫండబుల్ అని గమనించాలి.

జేఈఈ మెయిన్ రెండో విడత (సెషన్-2)కు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఆగస్టు 3న విడుదలచేసింది. ఆన్సర్ కీతోపాటు క్వశ్చన్ పేపర్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ/బీటెక్), పేపర్-2ఎ (బీఆర్క్), పేపర్-2బి (బీప్లానింగ్) పరీక్షల ఆన్సర్ కీని రెస్పాన్స్‌లతో సహా ఎన్టీఏ అందుబాటులో ఉంచింది.

ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5న సాయంత్రం 5 గంటల్లోగా తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి.  డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పేటీమ్ ద్వారా ఫీజు చెల్లించాలి. మరే ఇతర మార్గాల్లోనూ చెల్లించే అవకాశం లేదు. ఈ ఫీజు నాన్ రిఫండబుల్.

Notification

JEE(Main) 2022 Session 2, Display Question Paper and Answer Key

ప్రాథమిక కీపై అభ్యంతరాల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తుది ఆన్సర్ కీ, అభ్యర్థుల వ్యక్తిగత స్కోరు కార్డు, మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్-2022 సెషన్-2 పరీక్ష ఫలితాలు ఆగస్టు 6న ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించిన సంగతి తెలిసిందే. తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటించనున్నారు.

జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30 వరకు జరిగాయి. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అంతకుముందు జేఈఈ మెయిన్​ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్‌ 100 పర్సంటైల్ సాధించడం విశేషం. 

Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షను జులై 21 నుంచి నిర్వహించింది. ఆ తర్వాత తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటించబడతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది.

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హాజరుకావచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలను మాత్రమే ఎన్‌టీఏ ప్రకటించింది. సెషన్-2 పరీక్ష తర్వాత అభ్యర్థుల ర్యాంక్‌లు ప్రకటించబడతాయి.

Also Read:  ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!

ఇలా చెక్ చేసుకోండి..
Step 1: అభ్యర్థులు మొదటగా jeemain.nta.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: హో పేజీలో ''JEE(Main) 2022 Session 2, Display Question Paper and Answer Key'' అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. 
Step 4: అభ్యర్థి తనకు అనువైన వివరాలతో లాగిన్ కావచ్చు. 
Step 5:  అనంతరం మీ రిజల్ట్ స్క్రీన్ పై క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ దర్శనమిస్తాయి. ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. 

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brain Storage Capacity: మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Free Online Courses India: ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!
ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!
ABP Desam Smart Ed Conclave: చదువుతోనే యువత జీవితాలు మారుతాయి - ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌ కాన్‌క్లేవ్‌లో సీతక్క స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు
చదువుతోనే యువత జీవితాలు మారుతాయి - ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌ కాన్‌క్లేవ్‌లో సీతక్క స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
AI career certificate: గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
Ideas of India 2026 Nara Lokesh: గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
Vijay Sangeetha Divorce: నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
Embed widget