అన్వేషించండి

MBBS: జులై 21 నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ దివ్యాంగ అభ్యర్థులకు అసెస్‌మెంట్!

తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగ అభ్యర్థులు జులై 21 నుంచి అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు.

తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగ అభ్యర్థులు జులై 21 నుంచి అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు వారికి నిర్దేశించిన తేదీల్లో మెడికల్ బోర్డు ఎదుట హాజరుకావాలని వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ జులై 18న ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నిమ్స్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బోర్డుముందు హాజరు కావాలంది. జులై 21న ఒకటో ర్యాంకు నుంచి 5 లక్షల ర్యాంకు వరకు, జులై 22న 5 లక్షల పైన.. 7.5 లక్షల వరకు ర్యాంకు పొందినవారు, జులై 23న 7.5 లక్షలకు పైన ర్యాంకు వచ్చిన అభ్యర్థులు హాజరుకావాలని వర్సిటీ సూచించింది.

MBBS: జులై 21 నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ దివ్యాంగ అభ్యర్థులకు అసెస్‌మెంట్!

ALSO READ:

ఓయూ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, 2023-24 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో (ఫేజ్-1) అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పీజీ కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం; డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం, బీబీఏ ఉన్నాయి. అలాగే వివిధ విభాగాల్లో అడ్‌వాన్స్‌డ్ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్‌-1 అడ్మిషన్లు జులై 20న ప్రారంభం కానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నీట్ ఆలిండియా లెవల్ తొలిదశ కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహణ!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది కూడా పాత విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. నీట్‌-యూజీ‌లో అర్హత సాధించిన విద్యార్థులకు 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగానూ.. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తొలిదశ కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాతే.. రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్న ఇంజినీరింగ్ కళాశాలలు జులై 28లోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటికి యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లేదా న్యాక్, ఎన్‌బీఏ గ్రేడ్ తప్పనిసరిగా ఉండాలి. పరిశోధనల కోసం రూ.25 లక్షలతో కార్పస్ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలను విశ్వవిద్యాలయ సలహా కమిటీ పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు అనుబంధ కళాశాలలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చు. జేఎన్‌టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ అనుమతి పొందాకే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Telugu TV Movies Today: బాలయ్య ‘బంగారు బుల్లోడు’, పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ to విజయ్ ‘లియో’, కీర్తి సురేష్ ‘మహానటి’ వరకు- ఈ శుక్రవారం (మార్చి 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
బాలయ్య ‘బంగారు బుల్లోడు’, పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ to విజయ్ ‘లియో’, కీర్తి సురేష్ ‘మహానటి’ వరకు- ఈ శుక్రవారం (మార్చి 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
RR New Captain For First 3 Games: రాయ‌ల్స్ కు బిగ్ ట్రబుల్.. తొలి మూడు మ్యాచ్ ల‌కు కొత్త కెప్టెన్.. రీజ‌న్ తెలిస్తే షాకే..!
రాయ‌ల్స్ కు బిగ్ ట్రబుల్.. తొలి మూడు మ్యాచ్ ల‌కు కొత్త కెప్టెన్.. రీజ‌న్ తెలిస్తే షాకే..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Telugu TV Movies Today: బాలయ్య ‘బంగారు బుల్లోడు’, పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ to విజయ్ ‘లియో’, కీర్తి సురేష్ ‘మహానటి’ వరకు- ఈ శుక్రవారం (మార్చి 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
బాలయ్య ‘బంగారు బుల్లోడు’, పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ to విజయ్ ‘లియో’, కీర్తి సురేష్ ‘మహానటి’ వరకు- ఈ శుక్రవారం (మార్చి 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
RR New Captain For First 3 Games: రాయ‌ల్స్ కు బిగ్ ట్రబుల్.. తొలి మూడు మ్యాచ్ ల‌కు కొత్త కెప్టెన్.. రీజ‌న్ తెలిస్తే షాకే..!
రాయ‌ల్స్ కు బిగ్ ట్రబుల్.. తొలి మూడు మ్యాచ్ ల‌కు కొత్త కెప్టెన్.. రీజ‌న్ తెలిస్తే షాకే..!
CM Chandrababu: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Embed widget