అన్వేషించండి

NEET PG 2023: ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌, నీట్‌ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంపు

నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది..

ఎంబీబీఎస్ అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నీట్ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేవారే నీట్ పీజీ-2023 పరీక్షకు అర్హులని కేంద్రం తొలుత పేర్కొంది. ఆ కటాఫ్ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ గత నెల 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

కొవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ గతేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 30 లోపు అది పూర్తవ్వదు. ఫలితంగా చాలామంది విద్యార్థులు నీట్ పీజీ పరీక్ష రాసేందుకు అనర్హులుగా మారే ముప్పు ఏర్పడింది. తాజా నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 4 వేలమంది విద్యార్థులు సహా పలు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఉపశమనం లభించినట్లయింది. వీరంతా ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 12 వరకు నీట్ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మార్చి 5న జరగనుంది. దాన్ని వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు విన్నవిస్తున్నాయి. మరోవైపు- ఎండీఎస్ నీట్ రాసేందుకు వీలుగా బీడీఎస్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 7న ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఎండీఎస్ నీట్ అభ్యర్థులు ఫిబ్రవరి 10న సాయంత్రం 3 గంటల నుంచి ఫిబ్రవరి 12న అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నీట్- సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అర్హత ప్రమాణాన్ని 50 పర్సంటైల్ నుంచి 20 పర్సంటైల్‌కు కేంద్రం తగ్గించింది. జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)తో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష- 2023 తేదీని మార్చాలంటూ డిమాండ్లు వస్తోన్న వేళ ఆ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టుగా జరుగుతోన్న దుష్ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. అదంతా దుష్ప్రచారమేనని.. ఎవరూ నమ్మొద్దని స్పష్టంచేసింది. మార్చి 5న జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో మార్పులు జరిగాయని.. మే 21కి మార్పు చేసినట్టు పేర్కొన్న ఆ నోట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. నీట్ పీజీ 2023 పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సందేశం సర్క్యులేట్ అవుతోంది. అది ఫేక్ సందేశం. ఇలాంటి నకిలీ సందేశాలను ఇతరులకు షేర్ చేయొద్దు అని ట్విటర్‌లో కోరింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Hyderabad drugs case: కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Hyderabad drugs case: కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
Nepal Gen Z outcry: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
Tesla drops: అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
Adilabad Cement Factory: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
TG CPGET Results: తెలంగాణ CPGET ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే! 
తెలంగాణ CPGET ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే! 
Embed widget