అన్వేషించండి

NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!

NEET JEE Weightage Changes: దేశవ్యాప్తంగా NEET, JEEలో ఎలాగైనా సీటు సంపాదించాలని విద్యార్థులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని తగ్గించే పనిలో కేంద్రం ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం NEET, JEE పరీక్షల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
  • ప్రవేశ, బోర్డు పరీక్ష మార్కులకు 50% వెయిటేజీ యోచన.
  • విద్యార్థుల ఒత్తిడి తగ్గి, కోచింగ్ దందా తగ్గుతుంది.
  • బహుళ ప్రయత్నాలు, ఆన్-డిమాండ్ పరీక్షలు పరిశీలనలో ఉన్నాయి.

NEET JEE Weightage Changes: విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు ఇంటర్‌మీడియట్. దీని తర్వాత రాసే ప్రతీ పరీక్ష కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతోంది. అన్నింటి కంటే NEET, JEEపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఎక్కడైనా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత విజయం సాధించలేకపోయామని కొందరు విద్యార్థులు విషాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జేఈఈ, నీట్‌ విషయంలో మాత్రం పరీక్ష భయంతోనే విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతటి ఒత్తిడి ఉన్న ఈ పరిక్షల్లో కీలక సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ జాతీయ స్థాయి పరీక్ష కేవలం ప్రవేశ పరీక్ష మార్కులు ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. అందుకే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులపై ఆరో తరగతి నుంచే ఒత్తిడి పెడుతున్నారు. అందుకే సంస్కరణలు చేపట్టాలని కేంద్రం చూస్తోంది. ప్రవేశ పరీక్ష మార్కులతోపాటు బోర్డు పరీక్షల్లో వచ్చే మార్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చూస్తోంది. ఇలా చేయడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి చదువుల శైలిలో మార్పులు వస్తాయని ఆశిస్తోంది  

పరిగణలోకి బోర్డు పరీక్ష ఫలితాలు 

ప్రస్తుతం జేఈఈ, నీట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులు ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు. అందులో ఈ మార్కులు, రిజర్వేషన్లు ఆధారంగా వారికి అత్యున్నత విద్యా సంస్థల్లో చదువుకునే వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు బోర్డు పరీక్షలను కేవలం అర్హతగా చూస్తున్నారు. అంటే బోర్డు పరీక్షల్లో పాస్ అయితే చాలు వాళ్లు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు రాసుకోవచ్చు. దీన్ని మార్చాలని కేంద్రం చూస్తోందని తెలుస్తోంది. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల మెరిట్ జాబితా సిద్ధం చేసినప్పుడు బోర్డు పరీక్షల మార్కులను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిదని భావిస్తోంది. ఇది 50 శాతం వరకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తోంది.  

ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టు ఈ సంస్కరణ అమలులోకి వస్తే విద్యార్థులు, కాలేజీలు బోర్డు చదువులపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాటిని పాస్ కోసం మాత్రం చూస్తూ వచ్చారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై ఎక్కువ ఫోకస్ చేశారు. అంతే కాదు పోటీ పరీక్ష తీవ్రతను కూడా తగ్గించే పనిలో ఉంది. ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న సబ్జెక్ట్‌కు అనుగుణంగానే సిలబస్ మారిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా కోచింగ్ సెంటర్స్‌ దందా కూడా తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడాదిలో ఒకసారి మాత్రమే ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వారు, ఇప్పుడు దీన్ని మల్టిపుల్ టైమ్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్ కూడా ప్రభుత్వం వద్ద ఉంది. కంప్యూట్ ఆధారిత ఆన‌ డిమాండ్ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సులు అందుకున్నారు.

మార్పులకు కారణాలు 

కీలకమైన సంస్కరణకు చాలా కారణాలు ఉన్నాయి. పరీక్ష పత్రాల లీకేజీ ప్రధాన సమస్యగా మారింది. పరీక్షలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా లీకేజీలు అరికట్టడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. దీంతోపాటు పరీక్ష విధానంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. మూల్యాంకనంపై అనేక అనుమానాలు ఉంటున్నాయి. పైస్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది కేవలం ఈ జాతీయ స్థాయి పరీక్షల కోసమే సన్నద్ధమవుతున్నారు. కీలకమైన బోర్డు సిలబస్‌ను పట్టించుకోవడం లేదు. ప్రత్యేక కోచింగ్ సెంటర్స్‌కు వెళ్లి కాలేజీకులకు, స్కూల్స్‌కు వెళ్లకుండా ప్రిపేర్ అవుతున్నారు. దీని వల్ల వారిలో సబ్జెక్ట్ రాకుండా పోతోంది. అలాంటి విద్యార్థులు సీటు రాకపోతే ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు విద్యార్థులు సీరియస్‌గా అన్నింటిని కవర్ చేస్తూ చదువుతున్నారు. అలాంటి విద్యార్థుల జీవితం ఒక రోజు పరీక్షతో నిర్ణయం కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ రోజు విద్యార్థి రాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకా ఏదైనా జరిగినా మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. విలువైన కాలం వృథా పోతోంది. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టాలని చూస్తోంది. 

సంస్కరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే....

ఈ రెండు జాతీయ స్థాయి పరీక్షా విధానంలో ఉన్న లోపాలు గమనించిన ప్రభుత్వం గత ఏడాది 9 మంది సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. లోపాలు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పడకుండా, పారదర్శకత పెంచేందుకు లోతైన అధ్యయనం చేయాలని టాస్క్ ఈ కమిటీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కమిటీ తన స్టడీని కంప్లీట్ చేసింది. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వబోతోంది. ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత వారు చేసిన సిఫార్సులు అమలు విషయంపై క్లారిటీ వస్తుంది. వాటి తీవ్రతను బట్టి వచ్చే విద్యాసంవత్సరం నుంచా లేదా దశల వారీగా అమలు చేస్తారా అనేది తేల్చనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రం కొన్ని అమలు అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. 

Frequently Asked Questions

జేఈఈ, నీట్ పరీక్షా విధానంలో సంస్కరణలు ఎందుకు చేపడుతున్నారు?

విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి, పరీక్ష పత్రాల లీకేజీలు, మూల్యాంకనంపై అనుమానాలు, బోర్డు సిలబస్‌ను నిర్లక్ష్యం చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ సంస్కరణలు చేపడుతున్నారు.

జేఈఈ, నీట్ ప్రవేశాల్లో బోర్డు పరీక్షల మార్కుల గురించి ప్రధానంగా ప్రతిపాదించిన సంస్కరణ ఏమిటి?

జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష మార్కులతో పాటు బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది 50 శాతం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.

బోర్డు పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి, చదువుల శైలిలో మార్పులు వస్తాయి. విద్యార్థులు బోర్డు చదువులపై కూడా శ్రద్ధ పెడతారు, కోచింగ్ సెంటర్ల దందా కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

ఈ సంస్కరణలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి?

9 మంది సభ్యుల నిపుణుల కమిటీ అధ్యయనం పూర్తి చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. నివేదిక అందిన తర్వాత వచ్చే విద్యాసంవత్సరం నుంచా లేదా దశల వారీగా అమలు చేస్తారా అనేది తేలుస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget