అన్వేషించండి

CBSE Board Exams: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కీలక మార్పులు.. ఎప్పుడంటే?

CBSE Board Exams: నూతన జాతీయ విద్యావిధానం-2020 కు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం ప్రక్రియను మరింత సమగ్రంగా, నైపుణ్యం ఆధారితంగా, యోగ్యత ఆధారితంగా మార్పులు చేపట్టనున్నారు.

CBSE Board Exams: ఒకవైపు విద్యార్థులు సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు వచ్చే ఏడాది నిర్వహించబోయే పరీక్షల విధానంలో భారీ మార్పులు చేయాలని బోర్డు నిర్ణయించింది. నూతన జాతీయ విద్యావిధానం-2020 కు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం ప్రక్రియను మరింత సమగ్రంగా, నైపుణ్యం ఆధారితంగా, యోగ్యత ఆధారితంగా మార్పులు చేపట్టనున్నారు. ఈ కొత్త విధానంలో విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల ప్రతిభను సమగ్రంగా అంచనావేసే వెసులుబాటు ఉండనుంది. ఇప్పటికే ఈ విధానాన్ని చాలా పాఠశాలలు అనుసరిస్తున్నాయి. 2024 నుంచి అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్..

అసెస్‌మెంట్ అనేది ఏడాది మొత్తం సాగాల్సిన ప్రక్రియ, అంతేగాని విద్యాసంవత్సరం చివరలో నిర్వహించే 3 గంటల పరీక్షల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని నిర్ణయించలేము. ఇందులో భాగంగా అన్ని పేపర్లలో ప్రాక్టికల్స్‌కు స్వస్తి పలికి.. వాటి స్థానంలో 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ చేర్చాల్సిన అవసరం ఉంది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేయాలన్సి అవసరం ఉంది. దీనివల్ల విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంచనా వేయగలరు.

ప్రశ్నపత్రంలోనూ మార్పులు...

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల ప్రశ్నపత్రంలోనూ రెండు రకాల నిర్మాణాత్మక మార్పులు చేయనున్నారు. ఒకటి ప్రశ్నల సంఖ్యను పెంచడం, రెండోది ప్రశ్నల సరళిలో మార్పులు. విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లను అందించడానికి సీబీఎస్‌ఈ అంతర్గతంగా ప్రశ్నల సంఖ్యను 33% పెంచింది. దీనివల్ల విద్యార్థులు తమకు నచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసే వెసులుబాటు ఉండనుంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించేందుకు వీలుగా ప్రశ్నలు ఇక నుంచి నైపుణ్యం, సామర్థ్యాల ఆధారంగా ఉంటాయి.

3, 5, 8 తరగతుల విద్యార్థులకు కూడా..

విద్యార్థి యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని సాధించడమే లక్ష్యంగా 3, 5 మరియు 8 తరగతులలో విద్యార్థి యొక్క మూల్యాంకనంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. 3, 5 మరియు 8 తరగతుల విద్యార్థులపై  మూల్యాంకన సర్వే చేస్తారు. ఈ పరీక్ష విద్యార్థులు మార్కులు సాధించే సాధారణ పరీక్షలా ఉండదు. ఈ పరీక్షల ద్వారా, వారి స్థాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంచనావేస్తారు. 3వ తరగతి విద్యార్థికి క్లాస్ 2లోని గణితం, సైన్స్ సబ్జెక్టుల గురించి అవగాహన ఉండదు. కాబట్టి, తదుపరి తరగతులలో వాటిని తగ్గించే లక్ష్యంతో అభ్యాస అంతరాలను పంచుకోవడం జరుగుతుంది.

విద్యార్థులకు మూల్యాంకన కార్డులు..

విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా అసెస్‌మెంట్(మూల్యాంకన) కార్డులను ప్రవేశపెట్టే యోచనలో సీబీఎస్‌ఈ ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. అసెస్‌మెంట్ కార్డ్ ద్వారా.. ఒక విద్యార్థి ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంచనావేసే వీలుంటుంది. విద్యార్థి కూడా తనను తాను స్వీయ-అంచనా చేసుకుంటాడు. దీనిని విద్యార్థుల 360-డిగ్రీ మూల్యాంకనంగా పేర్కొనవచ్చు.

ఈ అన్నిరకాల మార్పులకు సంబంధించి సీబీఎస్ఈ ఇప్పటికే సంస్కరణలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేయనున్నారు. 2024 నుంచి అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
UK Study Cost for Indians : యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే
యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే
Lion Pride: నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!
నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!
Supreme Court Judges: సుప్రీంకోర్టులో పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య! కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం!
సుప్రీంకోర్టులో పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య! కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS MI Result Update: టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Sreemukhi New House: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శ్రీముఖి... బర్త్ డే స్పెషల్ - ఫోటోలు చూశారా?
కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శ్రీముఖి... బర్త్ డే స్పెషల్ - ఫోటోలు చూశారా?
Renault Mini Duster: 30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
Embed widget