అన్వేషించండి

Education News Today: డిప్లొమా విద్యార్థులకు అలర్ట్ - వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ, బీటెక్ ప్రవేశాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

Education News: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీచేస్తారు.

Telangana AGRICET & AGRIENGGCET 2024 Notification: హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యాసంవత్సరానికిగాను బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌-2024 నోటిఫికేఫన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీచేస్తారు. డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులకు వ్యవసాయ వర్సిటీ పరిధిలో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ, బీటెక్‌ (అగ్రి ఇంజినీరింగ్) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు, మిగతా 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ కింద కేటాయిస్తారు.

అభ్యర్థులు ఆగస్టు 9 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్యరుసుముతో ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1400 చెల్లించాలి. ఆలస్యరుసుముతో అయితే రూ.2100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. అయితే ఆలస్యరుసుముతో రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఆగస్టు 24న ఆన్‌లైన్ విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అగ్రిసెట్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యామాల్లో, అగ్రి ఇంజినీరింగ్ సెట్ పరీక్షను కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.

వివరాలు..

అగ్రిసెట్-2024 & అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌-2024 (AGRICET & AGRIENGGCET - 2024 )

* అగ్రిసెట్ (AGRICET)-2024 

సీట్ల సంఖ్య: 92.

సీట్ల కేటాయింపు: అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు 76 సీట్లు, సీడ్ టెక్నాలజీ విద్యార్థులకు 7 సీట్లు, ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యా్ర్థులకు 9 సీట్లు కేటాయించారు. ఇక ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 9, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా కింద 34 సీట్లు కేటాయించారు.

అర్హత: తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 25 సంవత్సరాల వరకు; దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

ALSO READ: పీజీఈసెట్‌-2024 కౌన్సెలింగ్‌ షెడ్యూలు వెల్లడి, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?

* అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ (AGRIENGGCET) - 2024

మొత్తం సీట్లు: 8. ఇందులో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 1, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా కింద 1 సీటు కేటాయించారు.

అర్హత: తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి డిప్లొమా (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.12.2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 25 సంవత్సరాల వరకు; దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1400; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు డిప్లొమా స్థాయిలో చదివిన అంశాల నుంచే ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్.

ముఖ్యమైన తేదీలు..

⫸ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2024.

⫸ ఆలస్య రుసుముతో దరఖాస్తు ప్రారంభం: 10.08.2024.

⫸ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 12.08.2024.

⫸ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 24.08.2024. (2.30 PM to 04.10 PM.)

⫸ ఆన్సర్ కీ అందబాటులో: 28.08.2024 నుంచి 29.08.2024 వరకు. 

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget