అన్వేషించండి

TS LPCET: ఐటీఐ విద్యార్థులకు పాటిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు - ఎంపిక వివరాలు ఇవే!

తెలంగాణలో ఐటీఐ అర్హత ఉన్న విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్దేశించిన ‘లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌)-2024’ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది.

TS LP CET 2024: తెలంగాణలో ఐటీఐ అర్హత ఉన్న విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్దేశించిన ‘లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌)-2024’ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణలోని పాలిటెక్నిక్/ఇన్‌స్టిట్యూషన్స్‌ (ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ అన్‌ఎయిడెడ్‌/ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు)ల్లో రెండో సంవత్సరం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.

వివరాలు..

* లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌)-2024

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

డిప్లొమా విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.

పరీక్ష ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ.300 చెల్లించాలి. అభ్యర్థులు 'Secretary, SBTET, TS, Hyderabad' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, పరీక్ష ఫీజు నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. దరఖాస్తుకు డిడి జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష కేంద్రం: గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: 
The Principal, 
Govt. Polytechnic, Masabtank, 
Hyderabad.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.03.2024.

➥ దరఖాస్తులు పొందడానికి చివరితేది: 16.04.2024.

➥ రూ.100 ఆలస్య రుసుముతో దరఖాస్తులు పొందడానికి చివరితేది: 18.04.2024.

➥ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 20.04.2024.

➥ ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 20.05.2024.

➥ ఫలితాల వెల్లడి: పరీక్ష ముగిసిన 12 రోజుల తర్వాత.

LPCET-2024-Notification

LPCET-2024-Detailed Notification

LPCET-2024 Booklet

LPCET-2024 Students Application

ALSO READ:

TS POLYCET 2024: పాలీసెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌, పరీక్ష షెడ్యూలులో మార్పు, కొత్త తేదీ ఇదే!
తెలంగాణలో పాలిసెట్ 2024 వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TS POLYCET)ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం మే 17న పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. మే 24కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో నాలుగో విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగో విడతలో మే 13న లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. మే 26న నామినేషన్ల పరిశీలన,  మే 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
పాలీసెట్ పరీక్ష తేదీ, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget