అన్వేషించండి

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం, ఎప్పటివరకంటే?

JEE Main 2025: జేఈఈ మెయిన్ రెండో విడత దరఖాస్తుల సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 28న రాత్రి 11.50 వరకు తమ వివరాలు సవరించుకునే వెసులుబాటును ఎన్టీఏ కల్పించింది.

JEE Main Session 2 Application correction: జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత పరీక్షకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. విద్యార్థులు  ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 28 రాత్రి 11.50 వరకు తమ వివరాలు సవరించుకోవచ్చు. ఈ మేరకు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించి షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

ఇవి మార్చేందుకు  ‘నో’ ఛాన్స్‌..

* జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేందుకు అవకాశం ఉండదు. ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశమిచ్చింది. కాబట్టి జాగ్రత్తగా వివరాలను సవరించుకోవాలని ఎన్టీఏ సూచించింది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, అడ్రస్‌ (శాశ్వత/ప్రస్తుత), ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి అవకాశం ఉండదు.

* అభ్యర్థి పేరు/తండ్రి పేరు/తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఉంటుంది.

* పదోతరగతి, ఇంటర్ సంబంధిత వివరాలు, పాన్‌ కార్డు నంబర్‌, పరీక్ష రాయాలనుకొనే నగరం, మాధ్యమాన్ని మార్చుకునేందుకు అవకాశం ఉంది. 

* అభ్యర్థి పుట్టినతేదీ, జెండర్‌, కేటగిరీ, సబ్‌ కేటగిరీ/పీడబ్ల్యూడీ, సంతకం మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. 

రెండు సెషన్ల విద్యార్థులూ వీటిని మార్చుకొనే ఛాన్స్‌..
జేఈఈ మెయిన్ సెషన్-1 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా తమ వివరాల్లో మార్పులు చేసుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. అభ్యర్థులు కోర్సు (పేపర్‌), ప్రశ్నపత్రం మాధ్యమం, స్టేట్‌ కోడ్‌ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామ్‌ సిటీ, పదో తరగతి, 12వ తరగతి సంబంధిత విద్యార్హత వివరాలు, జెండర్‌, కేటగిరీ వంటి వివరాలనుమాత్రమే మార్చుకొనేందుకు ఎన్‌టీఏ అవకాశం కల్పిస్తోంది. 

Public Notice

JEE(Main) 2025 Session 2 Application Edit

ఏప్రిల్‌ 1 నుంచి సెషన్-2 పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి 8 మధ్య సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నారు. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్‌ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. 

ఇటీవల వెల్లడించిన జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12,58,136 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో రాణించారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 10వ ర్యాంకులో, తెలంగాణకు చెందిన బాని బ్రత మాజీ 12వ ర్యాంకులో నిలిచారు. జేఈఈ (మెయిన్) పేపర్-2 (బీఆర్క్‌/బి ప్లానింగ్‌) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget