అన్వేషించండి

JEE Advanced 2022 Registration: నేటితో జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తుకు ఆఖరు, ఈ సమయం వరకే అవకాశం!

వాస్తవానికి ఆగస్టు 11తో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఒకరోజు పెంచి ఆగస్టు 12 వరకు పొడిగించారు. షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు గడువు ఆగస్టు 12తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థలు రాత్రి 8 గంటలకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 8న ప్రారంభించిన సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆగస్టు 11తో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఒకరోజు పెంచి ఆగస్టు 12 వరకు పొడిగించారు.

షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల తర్వాత ఆగస్టు 8 నుంచి అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు.

అర్హతలు ఇవే..

✪ జేఈఈ మెయిన్స్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అన్ని విభాగాల అభ్యర్థుల నుంచి 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఎంపికచేస్తారు.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షకు 01.10.1997 తర్వాత జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. వీరు 01.10.1992 తర్వాత జన్మించినవారై ఉండాలి.

✪ అభ్యర్థులకు వరుసగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షలకు 2022 లేదా 2021 సంవత్సరాల్లో ఇంటర్ పాసై.. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

✪ అయితే 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఫలితాలను 2020, అక్టోబరు 15 తర్వాత ప్రకటించినట్లయితే.. 2020లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు ఫీజు వివరాలు..

✪ మహిళా అభ్యర్థులు (ఇండియా): రూ.1400.

✪ మిగతా అభ్యర్థులందరికీ: రూ.2800. 

✪ ఇండియాలో ఇంటర్ చదివిన  విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6000.

✪ ఇండియాలో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6,000.

✪ ఇతర దేశాల్లో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (నాన్ - సార్క్ దేశాలు): రూ.12,000.

ముఖ్యమైన తేదీలు..

✪ జేఈఈ అడ్వా్న్స్డ్ రిజిస్ట్రేషన్: 08.08.2022 - 11.08.2022.

✪ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.08.2022.

✪ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: 23.08.2022 - 28.08.2022.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష తేది: 28.08.2022.

పరీక్ష సమయం: 

పేపర్-1: ఉ. 9.00 గం. - మ.12:00 గం. వరకు.

పేపర్-2: మ.14:30 - సా.17:30 గం. వరకు.

✪ ప్రాథమిక కీ: 03.09.2022.

✪ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 - 04.09.2022. 
✪ తుది ఆన్సర్ కీ: 11.09.2022.
✪ ఫలితాల వెల్లడి: 11.09.2022.

* ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2022

✪ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 11.09.2022 - 12.09.2022.
✪ జాయింట్ సీట్ అలొకేషన్ ప్రారంభం (JoSAA): 12.09.2022.
✪ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: 14.09.2022.
✪ ఫలితాల వెల్లడి: 17.09.2022


JEE (Advanced)-2022: Information Brochure

JEE (Advanced)-2022: Online Registration Portal


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
11 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Vanajeevi Ramaiah: గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
Highest Paid Directors: భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Panic Delhi Thunderstorm | ముంబై మ్యాచ్ ప్రాక్టీస్ లో సుడిగాలి బీభత్సంCSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
11 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Vanajeevi Ramaiah: గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
Highest Paid Directors: భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
Tungabhadra Dam Gates: తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లు మార్చాల్సిందే, సామర్థ్యం తగ్గిపోయిందని పరీక్షల్లో వెల్లడి
తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లు మార్చాల్సిందే, సామర్థ్యం సగానికి తగ్గిపోయిందని పరీక్షల్లో వెల్లడి
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
Guava Health Benefits : రోజూ జామపండు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
రోజూ జామపండు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Telugu TV Movies Today: చిరంజీవి ‘శ్రీ మంజునాథ’, బాలయ్య ‘నరసింహా నాయుడు’ to ప్రభాస్ ‘సలార్’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘శ్రీ మంజునాథ’, బాలయ్య ‘నరసింహా నాయుడు’ to ప్రభాస్ ‘సలార్’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget