అన్వేషించండి

IISER Admissions: ఐఐఎస్‌ఈఆర్‌‌లో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ప్రవేశం ఇలా!

అభ్యర్థులు మే 25 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశం పొందువారు జూన్ 25 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దేశంలోని ప్రసిద్ధ సంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఆప్టిట్యూడ్‌ టెస్టులో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభావంతులు, కేవీపీవైకి ఎంపికైనవారినీ కోర్సుల్లో చేర్చుకుంటారు. ప్రవేశాలు పొందినవారికి ప్రతి నెలా స్టైపెండ్‌ ఇస్తారు. దేశంలో తిరుపతి, బరంపురం, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలో ఐఐఎస్‌ఈఆర్ విద్యాసంస్థులు ఉన్నాయి. అభ్యర్థులు మే 25 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశం పొందువారు జూన్ 25 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

1) బీఎస్‌ ఎంఎస్‌ డ్యూయల్ డిగ్రీ: బయలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్‌/ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, జియలాజికల్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌. 

2) బీఎస్‌ డిగ్రీ కోర్సులు (భోపాల్‌లోనే): ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్, డేటా సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), ఎకనామిక్స్‌ సైన్సెస్‌. వ్యవధి నాలుగేళ్లు. బీఎస్‌ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. ఎకనామిక్స్‌ కోర్సులో చేరినవారు బీఎస్‌ తర్వాత మరో ఏడాది చదువు పూర్తిచేసుకుంటే ఎంఎస్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.

బీఎస్‌-ఎంఎస్‌ సీట్ల వివరాలు: ఐఐఎస్‌ఈఆర్‌: బరంపురం - 200, భోపాల్‌ - 240, కోల్‌కతా - 250, మొహాలీ - 250, పుణె - 288, తిరువనంతపురం - 320, తిరుపతి - 200. ఏడు సంస్థల్లోనూ కలిపి 1748 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు భోపాల్‌లో బీఎస్‌: ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో 60, ఎకనామిక్‌ సైన్సెస్‌లో 30 సీట్లు ఉన్నాయి.

అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ/బైపీసీ) ఉత్తీర్ఱులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000. విదేశీ అభ్యర్థులు రూ.8500 చెల్లించాల్సి ఉంటుంది.

ప్రవేశ విధానం: మొత్తం 3 విధానాల్లో ప్రవేశాలు ఉంటాయి. వీటిలో కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఆప్టిట్యూడ్‌ టెస్టు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపినవారితో, కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజనకు ఎంపికైనవారితో 25 శాతం సీట్లు భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను ఆప్టిట్యూడ్‌ టెస్టు ద్వారా నింపుతారు. ఐఐటీ-జేఈఈ, కేవీపీవై విభాగాలకు కేటాయించిన సీట్లు మిగిలిపోతే ఆప్టిట్యూడ్‌లో ప్రతిభ చూపినవారితో వాటినీ భర్తీ చేస్తారు. కోరుకున్న విధానంలో ప్రవేశం పొందడానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష విధానం: మొత్తం 240 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఒక్కో సబ్జెక్టు నుంచి 15 చొప్పున 60 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.

కోర్సు స్వరూపం.. 
ఐదేళ్ల వ్యవధి ఉండే బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు సైన్స్‌లో ప్రాథమికాంశాలు బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐదో సంవత్సరం ఆర్‌ అండ్‌ డీ.. సంస్థలు, సైన్స్‌ అంశాలతో ముడిపడిఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండేళ్లు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్‌ కోర్సులు, ఎర్త్‌సైన్స్‌లు అభ్యసిస్తారు.ఆరు నెలలకు ఒకటి చొప్పున కోర్సు మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.05.2023.

➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో దరఖాస్తుల స్వీకరణ: 25.06.2023 - 30.06.2023.

➥ ఆప్టిట్యూడ్ పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: 10.06.2023.

➥ ఆప్టిట్యూడ్ పరీక్ష తేది: 17.06.2023. 

➥ ఆన్సర్ కీ వెల్లడి: 17.06.2023. 

➥ అభ్యంతరాల స్వీకరణ: 20 - 22.06.2023.

➥ ఫైనల్ కీ: 30.06.2023.

➥ ఆప్టిట్యూడ్ పరీక్ష ఫలితాల వెల్లడి: 03.07.2023.

➥ మొదటి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభం: 15.07.2023.

Information Brochure

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? -  ముగిసిన పోలీసుల కస్టడీ !
కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !
Warangal Crime News: డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
Viral News: ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Embed widget