By: ABP Desam | Updated at : 11 Sep 2022 09:59 PM (IST)
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశాలు
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చదువుకోవాలని కోరిక వుండి వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు, గ్రామీణ యువత, పనిచేయి స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి విద్యనందించడమే ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
వివరాలు..
* ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు 2022-23
1) పదోతరగతి ప్రవేశాలు
అర్హతలు: అభ్యర్థి ఏదైనా పాఠశాలలో చదివినట్లయితే, టీసీ/ రికార్డ్ షీట్ సమర్పించాలి. లేదా అభ్యర్థి ఏ పాఠశాలలోనైనా ప్రవేశం పొందకపోయినా పదో తరగతి చదివే సామర్థ్యం ఉన్నా అర్హులే.
వయోపరిమితి: 2022, ఆగస్టు 31 నాటికి కనీస వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
2) ఇంటర్ ప్రవేశాలు
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సీఈసీ.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: 2022, ఆగస్టు 31 నాటికి కనీస వయస్సు 15 సంవత్సరాలు. ప్రవేశానికి గరిష్ఠ వయోపరిమితి లేదు.
బోధనా మాధ్యమం: తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మరియి ఒరియా భాషల్లో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.
ప్రవేశ కాలపరిమితి: ఓపెన్ స్కూల్లోని ఏకోర్సులోనైన రిజిస్ట్రేషన్ పొందిన నాటి నుండి 5 సంవత్సరాల వరకు అడ్మిషన్ చెల్లుబాటు అవుతుంది.
పరీక్షా విధానం: ఏపీ ఓపెన్ స్కూల్ సంవత్సరంలో రెండుసార్లు పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తుంది. అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ అయిన ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిదిసార్లు పబ్లిక్ పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రతి సంవత్సరం మార్చి/ఏప్రిల్ మరియి జూలై/ఆగస్టు సమయాలలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఫీజు వివరాలు:
* పదోతరగతి ప్రవేశాల కోసం జనరల్ పురుష అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. అన్ని వర్గాల స్త్రీలు, ఎస్సీ,ఎస్సీ, బీసీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, ఎక్స్-సర్వీస్మెన్ విభాగాలకు చెందినవారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అడ్మిషన్ ఫీజు కింద జనరల్ పురుష అభ్యర్థులు 5 సబ్జెక్టుల వరకు రూ.1300, ఇతరులు రూ.900 చెల్లించాలి. ఇక మైగ్రేషన్ ఉన్నవారు రూ.200 చెల్లించాలి. ఒక్కో అదనపు సబ్జెక్టుకు రూ.200 అదనంగా చెల్లించాలి.
* ఇంటర్ ప్రవేశాల కోసం జనరల్ పురుష అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. అన్ని వర్గాల స్త్రీలు, ఎస్సీ,ఎస్సీ, బీసీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, ఎక్స్-సర్వీస్మెన్ విభాగాలకు చెందినవారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అడ్మిషన్ ఫీజు కింద జనరల్ పురుష అభ్యర్థులు 5 సబ్జెక్టుల వరకు రూ.1400, ఇతరులు రూ.1100 చెల్లించాలి. ఒక్కో అదనపు సబ్జెక్టుకు రూ.200 అదనంగా చెల్లించాలి.
ముఖ్యమైనతేదీలు..
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.
నిర్ణీత రుసుముతో అడ్మిషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 07.10.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఆలస్య రుసుముతో): 26.10.2022.
రూ.200 ఆలస్య రుసుముతో అడ్మిషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 28.10.2022
SSC Aposs 2022 - 23 Prospectus
Inter Aposs 2022 - 23 Prospectus
REGISTRATION FORM FOR SSC & INTER
Also Read:
NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించినట్లు ఇంటర్, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
Merit Scholarship: వెబ్సైట్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష హాల్టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్ కోర్సుల్లో సరికొత్త సిలబస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి
CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్కు పూనకాలే
/body>