అన్వేషించండి

AP Inter Revaluation 2022: ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

AP Inter Revaluation Apply Online: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతో పాటు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్న విద్యార్థులకు రికౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు వెళ్లే అవకాశం ఉంది.

AP Inter Revaluation 2022 Apply Online: ఏపీలో ఇటీవల ఇంటర్మీడియట్‌- 2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో బుధవారం ఈ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయగా.. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 61 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు 9,41,358 మందిలో రెగ్యులర్‌‌గా రాసిన విద్యార్థులు 8,69,059 మంది కాగా, వొకేషనల్‌ విద్యార్థులు 72,299 మంది ఉన్నారు. పరీక్షలు పూర్తయిన 28 రోజుల్లోనే ఇంటర్మీడియట్‌  ఫలితాలను ఏపీ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్‌ వొకేషనల్‌ పరీక్షల్లో ఫస్టియర్‌లో 45 శాతం, సెకండియర్ పరీక్షల్లో 55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు ప్రారంభం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతో పాటు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్న విద్యార్థులకు రికౌంటింగ్ (AP Inter Recounting), రీ వెరిఫికేషన్ కు వెళ్లే అవకాశం ఉంది. తమ రిజల్ట్స్‌కు సంబంధించి ఏపీ ఇంటర్ విద్యార్థులు మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ (AP Inter Re Verification) దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 25వ తేదీ నుంచి జూలై 5వ తేదీవరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయవచ్చని ఏపీ ఇంటర్ బోర్డ్ సూచించింది. అధికారిక వెబ్ సైట్  https://bie.ap.gov.in/ లో విద్యార్థులు తమ వివరాలతో నేటి నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం ఒక్కో పేపర్‌కు రూ.260 చెల్లించాలి. రీ వెరిఫికేషన్ తో పాటు జవాబు పత్రాలు స్కాన్ కాపీల కోసం ఒక్కో పేపర్ కోసం రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్  4,45,604 రాయగా 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ పరీక్షలకు 4,23,455 మంది హాజరుకాగా... 2,58,446 మంది పాస్‌ అయ్యారని మంత్రి బొత్స వెల్లడించారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 50 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాలుర అత్యధిక ఉత్తీర్ణత 66 శాతం కాగా, ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 34 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 72 శాతంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాలికల అత్యధికంగా పాస్ కాగా.. ఉమ్మడి కడప జిల్లా 47 శాతం మంది బాలికలే ఉత్తీర్ణులయ్యారు.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html

ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html

ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html

ప్రాక్టికల్స్‌ ఆగస్టు 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. ఫెయిలైన వారితోపాటు ప్రస్తుతం పాసైన ఇంటర్ విద్యార్థులు సైతం మార్కుల ఇంప్రూవ్‌మెంటుకోసం పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌ కింద పరీక్షలు జరుగుతాయి. గతంలో ప్రభుత్వ కాలేజీలలో 38 శాతం, ప్రైవేటు కాలేజీలలో 65 శాతం మంది విద్యార్థులు చదువుకోగా, ఇప్పుడు ప్రభుత్వం సంస్థల్లో 60 శాతం, ప్రైవేటు కాలేజీలలో 40 శాతం మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
Also Read: AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

Also Read: Botsa On Inter Results : ప్రతి మండలంలో 2 ఇంటర్ కాలేజీలు - అమ్మఒడి కింద ల్యాప్ ట్యాప్‌లిస్తామన్న బొత్స !

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget