అన్వేషించండి

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, 43 శాతం ఉత్తీర్ణత నమోదు

AP Inter Supply Results 2024: ఏపీలో ఇంటర్మీడియెట్‌ సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

AP Inter First Year Supplementary Results: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter First Year Supplementary Results) బుధవారం (జూన్ 26) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సప్లిమెంటరీ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రథమ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు.

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు..
➥ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి మొత్తం 43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు మొత్తం 1,46,750 మంది విద్యార్థులు హాజరుకాగా.. 63,548 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 1,33,591కిగాను 56,836 మంది, ఒకేషనల్ విద్యార్థులు 13,159కిగాను 6712 మంది ఉత్తీర్ణులయ్యారు. 

➥ ఇక ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసినవారిలో మొత్తం 78 శాతం విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు. పరీక్షలకు మొత్తం 2,10,820 మంది విద్యార్థులు హాజరుకాగా.. 1,64,716 మంది విద్యార్థుల మార్కులు పెరిగాయి. ఇందులో జనరల్ విద్యార్థులు 1,63,101 మంది ఉండగా.. 1615 ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.

➥ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలే ఆధిపత్యం చెలాయించారు. పరీక్షలకు 66,881 మంది బాలికలు హాజరైతే 31,048 మంది (46 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలురు 79,869 మంది పరీక్షకు హాజరైతే.. 32,500 మంది (41 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 

➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు కలిపిచూస్తే.. జనరల్ విభాగంలో 80 శాతం, ఒకేషనల్ విభాగంలో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 4,61,273 మంది విద్యార్థులు హాజరుకాగా.. 3,67,711 మంది (80 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో 38,483 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 29,893 మంది (78 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

రీవెరిఫికేషన్‌కు అవకాశం..
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలపై ఏమైనా సందేహాలుంటే రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 28 నుంచి జులై 4 వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

                       

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను జూన్ 18న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 1,27,190 మంది విద్యార్థులు హాజరు కాగా... 74,868 మంది (59 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు  మే 24  నుంచి జూన్ 3వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఇంటర్‌ సెకండియర సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకాగా... జూన్ 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine : HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
Brain Storage Capacity: మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Free Online Courses India: ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!
ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Embed widget