అన్వేషించండి

AP Inter Exam: ఏపీలో ఇంటర్మీడియట్ 'ఎన్విరాన్‌మెంటల్' పరీక్ష వాయిదా, కొత్త తేదీ ఇదే

ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 3న నిర్వహించే పబ్లిక్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్‌ విద్యా మండలి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సుబ్బారావు ఫిబ్రవరి 1న ప్రకటించారు.

Inter Environmental Exam: ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 3న నిర్వహించే పబ్లిక్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్‌ విద్యా మండలి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సుబ్బారావు ఫిబ్రవరి 1న ప్రకటించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో నైతికత-మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు ఉంటాయి. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉండగా.. ఫిబ్రవరి 3న నిర్వహించాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష వాయిదాపడింది. అదేవిధంగా సమగ్ర శిక్షా ఒకేషనల్ ట్రేడ్ పరీక్షను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఫిబ్రవ‌రి 3న ఏలూరు జిల్లా దెందులూరులో జగన్‌ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. దీనికి జనాలను తరలించేందుకు బస్సులు కావాలనే ఉద్దేశంతో పరీక్షను ఫిబ్రవ‌రి 23కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  

ఫిబ్రవరి 5 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..
ఏపీలో ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్ సాధారణ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా వృత్తి విద్య కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు.

ఏ రోజుకారోజే ప్రాక్టికల్‌ మార్కుల నమోదు.. 
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల మార్కుల నమోదులో ఇంటర్ విద్యామండలి.. కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రాక్టికల్ పరీక్ష ముగిసిన వెంటనే ఏ రోజు మార్కులను ఆ రోజే ఎగ్జామినర్.. కంప్యూటర్‌లో నమోదు చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. ఈ ఏడాది దీన్ని అమలు చేయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు హాజరైన ఎగ్జామినర్ ఫోన్‌కు ఇంటర్ విద్యామండలి ఓటీపీని పంపిస్తుంది. దాని ఆధారంగా కళాశాలలోని కంప్యూటర్ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగాలని మండలి ఆదేశించింది. మాన్యువల్‌గా మార్కులు నమోదు చేయకూడదని పేర్కొంది. 

మార్చి 1 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు..
ఏపీలో ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదోతరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget