అన్వేషించండి

AP DSC 2024: ఏపీ డీఎస్సీ అప్లికేషన్‌లో టెట్‌ 2024 హాల్‌టికెట్‌ నెంబర్‌ రాయాలట- అభ్యర్థులకు చుక్కలు !

AP DSC 2024 Application: డీఎస్సీ అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు. ఆన్‌లైన్‌లొ దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముప్పుతిప్పలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AP DSC 2024 News: ఏపీ డీఎస్సీ (AP DSC) అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు (DSC Application) చేసేందుకు అభ్యర్థులు (DSC Aspirants) ముప్పుతిప్పలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి కసరత్తు లేకుండా హడావుడిగా ప్రకటన విడుదల చేసి తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో ఏదైనా సమస్య ఏర్పడితే సంప్రదించాలంటూ ప్రభుత్వం ప్రకటించిన నెంబర్లు సరిగా పని చేయడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సహాయ కేంద్రాల ఫోన్లు సక్రమంగా పని చేడం లేదని చెబుతున్నారు.

టెట్‌ 2024 హాల్‌ టికెట్ ఎలా రాయాలి?

డీఎస్సీ దరఖాస్తుల్లో ప్రధానమైన సమస్య టెట్‌ హాల్‌టికెట్‌ నెంబర్లు. 2011 నుంచి టెట్‌ హాల్ టికెట్ల నెంబర్లు రాయమని చెబుతున్నారు. వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన లింక్‌లుకానీ ఇతర ఫెసిలిటీస్‌ కానీ లేవు. 13 ఏళ్లుగా హాల్‌టికెట్ల నెంబర్‌ ఎలా ఉంటాయనేది చాలా మందికి కలుగుతున్న అనుమానం. సరే వీటిని ఏదోలా రాస్తే... అసలు 2024 సంవత్సరం టెట్‌ హాల్ టికెట్‌ ఎలా రాయాలి అనేది ఇంకో పెద్ద అనుమానం. 18 వ తేదీ వరకు టెట్‌ అప్లికేషన్లు స్వీకరించారు. ఇప్పటి వరకు టెట్‌2024 హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించలేదు. అలాంటిది 22 వ తేదీతో ముగియనున్న డీఎస్సీ అప్లికేషన్‌లో టెట్‌ హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఎలా రాయాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 


AP DSC 2024: ఏపీ డీఎస్సీ అప్లికేషన్‌లో టెట్‌ 2024 హాల్‌టికెట్‌ నెంబర్‌ రాయాలట- అభ్యర్థులకు చుక్కలు !

పొరపాటు చేస్తే రూ.750 కట్టాల్సిందే
అంతేకాదు తప్పుల కరెక్షన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. గతంలో తప్పులు వస్తే సరి చేయడానికి అవకాశం ఉండేదని, ఇప్పుడు మరోసారి రూ.750 ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు సమయంలో తప్పులు సహజమని.. వాటిని సరి చేసుకోవడానికి అదనంగా వసూలు చేయడానికి ఇది ప్రభుత్వమా? ఓ ప్రైవేటు వ్యాపార సంస్థనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి దుస్థితి లేదని, దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పుడు సమాచారం నమోదు చేస్తే మరోసారి ఫీజు కట్టాలంటే వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా? అంటూ అభ్యర్థులు నిలదీస్తున్నారు. 

పేదవారి పరిస్థితి ఏంటి?
డీఎస్సీకి దరఖాస్తు చేసే వారిలో చాలా మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారని.. ఇప్పుడు తప్పుడు సమాచారం కరెక్షన్ పేరుతో రూ.750 వసూలు చేయడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్‌లకు నెలకు రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇంటిని, అన్నింటిని వదిలేసి దూరంగా ఉంటూ.. ఉద్యోగం కోసం సన్నద్ధమవుతుంటే దరఖాస్తులకు అదనంగా డబ్బులు చెల్లించాలనడం ఏంటని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.

వేధిస్తున్న సాంకేతిక సమస్యలు
దీనికి తోడు దరఖాస్తు సమయంలోను అభ్యర్థులను వెబ్‌సైట్ సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తు చేసే సమయంలో స్థానికేతర ఐచ్చికాన్ని ఎంపిక చేసుకుంటే 13 జిల్లాల పేర్లు చూపించాలి. కానీ, దరఖాస్తులో స్థానికేతర అనే ఐచ్ఛికం ఒక్కటే చూపిస్తుంది. జిల్లాల జాబితా చూపడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంటోంది. 

ఆ అవకాశం లేదు
స్కూల్‌ అసిస్టెంట్‌, ఇతర వాటిల్లో స్థానికేతర కోటాలో దరఖాస్తు చేసుకోవాడానికి ఇతర జిల్లాల జాబితా చూపించాలి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన దరఖాస్తుల్లో ఈ సదుపాయం లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులు 2,280 ఉన్నాయి. వీటిలో 1,022 పోస్టులు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. వేరే జిల్లా అభ్యర్థి ఈ జిల్లాలో మెరిట్‌ కోటా 15 శాతం కింద దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎవరూ పట్టనట్లు  వ్యవహరిస్తురనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ) పోస్టులు జోనల్‌ స్థాయిలో ఉన్నాయి. వాటికి దరఖాస్తు చేసుకునే సమయంలో సమస్యలు ఎదురువుతున్నాయి. సాధారణంగా ఒక జోన్‌లో ఉన్న వారు ఎక్కువ పోస్టులు ఉన్న మరో జోన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఆ సమయంలో స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేస్తే అన్ని జోన్‌లు కనిపించాలి. అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్‌ను ఎంచుకుని దరఖాస్తు పూర్తి చేస్తారు. అయితే తాజా డీఎస్సీ దరఖాస్తులో స్థానికేతర ఐచ్చికం వస్తుందే తప్ప జోన్‌ల జాబితా చూపడం లేదు. 

రెఫరెన్స్ ఐడీతోను తిప్పలు
దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులుమొదట దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించిన తరువాత రిఫరెన్స్‌ ఐడీ జనరేట్అవుతుంది. అయితే ఇది కొన్ని సార్లు సక్రమంగా పని చేయడం లేదు. కొంత మందికి 8 అంకెల నంబరు వస్తుంది. మరికొందరికి 9 అంకెల నంబరు వస్తోంది. తొమ్మిది అంకెలను ఐడీ వచ్చిన వారికి సమస్య వస్తోంది. రెఫరెన్స్ ఐడీ నమోదు చేస్తే దరఖాస్తును స్వీకరించడం లేదు. అలాగే దరఖాస్తుకు సమయం సైతం చాలా తక్కువ ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 రోజుల సమయం ఇచ్చారని, సర్వర్‌ మొరాయిస్తుండడంతో వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదని వాపోతున్నారు. గంటల కొద్ది సమయం అప్లికేషన్ పూర్తి చేయడానికే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Vizag Flight Issue:విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇంత కష్టమా? గంటా అసంతృప్తి!
విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇంత కష్టమా? గంటా అసంతృప్తి!
Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర ప్రారంభ తేదీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే.. ఆ సర్టిఫికెట్ లేకుంటే యాత్రకు అనుమతి ఉండదట, డిటైల్స్ ఇవే
అమర్​నాథ్ యాత్ర ప్రారంభ తేదీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే.. ఆ సర్టిఫికెట్ లేకుంటే యాత్రకు అనుమతి ఉండదట, డిటైల్స్ ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Embed widget