అన్వేషించండి

NEET 2025 Exam: నీట్ ఎగ్జామ్ రాసిన 72 ఏళ్ల పెద్దావిడ, ఎక్కడో కాదు ఏపీలోనే- ప్రశంసల వెల్లువ

NEET 2025 Exam News Updates | తెలంగాణలో తల్లి, కూతురు నీట్ ఎంట్రన్స్ టెస్టుకు హాజరు కాగా, ఏపీలో ఏకంగా 72 ఏళ్ల వయసులో ఓ పెద్దావిడ నీట్ పరీక్ష రాసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET Exam 2025) ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఒక్క నిమిషం నిబంధనను కచ్చితంగా అమలుచేశారు. కొన్నిచోట్ల తల్లీకూతుళ్లు ఇద్దరు వెళ్లి నీట్ ఎగ్జామ్ రాయగా.. ఓ చోట ఏకంగా 72 ఏళ్ల వయసున్న పెద్దావిడ సైతం నీట్ ఎంట్రన్స్ టెస్టు రాసి అందర్నీ ఆశ్చర్యానికి లోను చేశారు. చదువుకు వయసు అడ్డంకి కాదని, ఆ తల్లి, ఓ పెద్దావిడ నిరూపిస్తున్నారంటూ వీరిని ప్రశంసిస్తున్నారు.

ఆదివారం జరిగిన నీట్ పరీక్షలకు ఏపీలో లో 72 ఏళ్ల పెద్దావిడ హాజరయ్యారు. ఆమె పేరు పోతుల వెంకటలక్ష్మి కాగా, కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన నీట్ ఎగ్జామ్ రాశారు. టీనేజ్ నుంచి పాతికేళ్ల వయసున్న యువత మాత్రం తమ పెన్నులు, పెన్సిల్.. హాల్ టికెట్లు సరిగ్గా ఉన్నాయో లేదోనని చూసుకుని కంగారు పడుతూ పరీక్షలకు హాజరవుతుంటారు. కానీ ఏడు పదుల వయసులో వెంకటలక్ష్మీగారు చాలా ప్రశాంతంగా కనిపించారు. 

ఎవరో ఎగ్జామర్ రాయడానికి వస్తే, వారి వెంట వెంకటలక్ష్మీ వచ్చారని మొదట ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు, గేట్ వద్ద సిబ్బంది భావించారు. కానీ హాల్ టికెట్, ఐడీ కార్డు చూపించి ఎగ్జామ్ రాసేందుకు వచ్చానని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. సల్వార్ కమీజ్ ధరించి, హాల్ టికెట్ ఎగ్జామ్ కు కావాల్సిన పెన్ను, పెన్సిల్ లాంటి వాటిని తీసుకుని కాకినాడలోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్ కు ఆమె వచ్చారు. తన మనవడినో, మనవరాలికో ఆల్ ద బెస్ట్ చెప్పేందుకు వచ్చారని భావించిన వారు విషయం తెలిసి ప్రశంసించారు. చదువుకు వయసు అడ్డంకి కాదని ఆ పెద్దావిడ నిరూపిస్తున్నారు. ఏదైనా సాధించాలన్న ఆలోచన, ఆశయం ఉంటే ఏ వయసులోనైనా వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చునని ఆమెను చూసిన వారు అంటున్నారు.

నీట్ ఎగ్జామ్ రాసిన తల్లీకూతురు

తెలంగాణలో ఓ తల్లి, కూతురు నీట్ ఎగ్జామ్‌కు హాజరు కావడం హాట్ టాపిక్ అయింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన భూక్యా సరిత (38) ఆర్ఎంపీగా చేస్తున్నారు. ఆమె భర్త భూక్యా కిషన్ సైతం ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే బీఎస్సీ చివరి సంవత్సరంలో 2007లో ఆమెకు వివాహం జరగడంతో ఎగ్జామ్ రాయలేకపోయారు. ప్రస్తుతం వీరి కూతురు ఖమ్మంలో నీట్ కు శిక్షణ తీసుకుంది. అదే సమయంలో తల్లి సరిత సైతం నీట్ ఎగ్జామ్ కు ప్రిపేయర్ అయ్యి సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎగ్జామ్ రాశారు. కూతురు కావేరి  ఖమ్మంలోని గవర్నమెంట్ స్కూల్ ఎన్ఎస్‌పీ క్యాంపు సెంటర్లో ఎగ్జామ్ రాశారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget