అన్వేషించండి

Yadadri News: ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి - చనిపోయాడా, చంపేశారా?

Yadadri News: ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బైక్ యాక్సిడెంట్ జరిగి చనిపోయాడని ఓసారి, మెట్ల మీద నుంచి పడి మృతి చెందాడని మరోసారి సమాచారం అందించారు. నిజమేదీ..?

Yadadri News: తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ముందుగా తమ కుమారుడు.. బైక్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు ఫోన్ చేసి చెప్పగా.. మరికాసేపటికే మెట్లమీద నుంచి జారిపడి చనిపోయినట్లు తెలిపారని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడి మృతిపై తమకు అనుమానం ఉందని వివరిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రాంలింగంపల్లికి చెందిన గూడూరు రాంరెడ్డి, రాధ దంపతులకు 24 ఏళ్ల మణికాంత్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అయితే వైద్య విద్య కోసం మణికాంత్ ఫిలిప్పీన్స్ లోని దావో మెడికల్ రాలేజీలో 2020లో చేరాడు. కరోనా కారణంగా కొద్ది రోజులు ఆన్ లైన్ లోని క్లాసులు విన్నాడు. గతేడాది ఆగస్టులో ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు. ప్రస్తుతం అతడు ఎంబీబీస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆదివారం రోజు తెల్లవారుజామున మణికాంత్ రెడ్డి ఉంటున్న హాస్టల్ మేనేజర్ రాంరెడ్డికి ఫోన్ చేసి తమ కుమారుడు చనిపోయినట్లు తెలిపారు. అయితే ముందుగా బైక్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు చెప్పిన ఆయన ఆ తర్వాత కాసేపటికే మెట్లపై నుంచి జారి పడి మృతి చెందినట్లు వివరించారు. మణికాంత్ రెడ్డి మృతదేహం ఫొటో, వీడియో పంపించారు. 

అయితే హాస్టల్ వెనుక డ్రైనేజీలో మణికాంత్ రెడ్డి మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. హాస్టల్ యాజమాన్యం, పోలీసులు చెప్పిన తీరు వేర్వేరుగా ఉండడంతో కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మణికాంత్ రెడ్డి డ్రైనేజీలో పడి ఉండడం, తలకు గాయం కావడంతో అది హత్యేనని ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఎవరో చంపే అతడిని డ్రైనేజీలో పడేసి ఉంటారని అంటున్నారు.

15 రోజుల క్రితమే మన దేశానికి చెందిన కొంత మంది విద్యార్థులతో, మణికాంత్ రెడ్డికి గొడవ జరిగిందని.. వారిలో ఎవరైనా ఘాతుకానికి పాల్పడ్డారా అని అనుమానిస్తున్నారు. మణికాంత్ రెడ్డి మృతదేహాన్ని వెంటనే భారత్ కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రి కేటీఆర్ ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ఫిలిప్పీన్స్ లోని ఎంబసీతో పాటు అక్కడి ఎన్ఆర్ఐలతోనూ మాట్లాడాడు. వెంటనే మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు చనిపోయాడన్న వార్తను విన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. తమ కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

గుండెపోటుతో కెనడాలో నిజామాబాద్ విద్యార్థిని మృతి

నిజాబామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ) గ్రామ సర్పంచి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి, కుమార్తె పూజితా రెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. అలాగే పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాఆలలో బీడీఎస్ పూర్తి చేశారు. పీజీ చేసేందుకు జనవరి 26వ తేదీన కెనడా వెళ్లింది. సోదరుడు అరుణ్ రెడ్డి ఇంట్లో వారం ఉండి.. అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్ లో చేరింది. పది రోజుల కిందట హాస్టల్ లో ఉండగా.. ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సపొందుతూ పూజితా రెడ్డి మృతి చెందింది. 
అయితే అక్కడే ఉన్న పూజిత సోదరుడు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చాడు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కన్నుమూసిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
kadiri Registrar: ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
Samantha: ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?
ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
kadiri Registrar: ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
Samantha: ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?
ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Delhi Election Rally: 'మీ అడ్రస్ చెప్పండి, లేఖ పంపిస్తాను' - జనం మధ్యలో తన చిత్రపటం గుర్తించిన ప్రధాని మోదీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
'మీ అడ్రస్ చెప్పండి, లేఖ పంపిస్తాను' - జనం మధ్యలో తన చిత్రపటం గుర్తించిన ప్రధాని మోదీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Embed widget