అన్వేషించండి

Anand Mohan Singh: తెలుగు IAS అధికారి కృష్ణయ్య హత్య ఎలా జరిగింది? ఆనంద్ మోహన్‌ బ్యాగ్రౌండ్ ఏంటి?

Anand Mohan Singh: జి కృష్ణయ్య హత్య కేసులో దోషి ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Anand Mohan Singh:

ఆనంద్ మోహన్ విడుదల 

మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ సింగ్‌ను జైలు నుంచి విడుదల చేయడం దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. జైలు చట్టాల్ని మార్చేసి మరీ అతడిని బయటకు తీసుకురావడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. IAS జి. కృష్ణయ్య హత్య కేసులో శిక్ష పడిన ఆనంద్ మోహన్‌ మరి కొన్నాళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి ఉంది. కానీ బిహార్ ప్రభుత్వం జైలు చట్టాల్లో మార్పు చేయడం వల్ల త్వరగా విడుదల చేయాల్సి వచ్చింది. డ్యూటీలో ఉన్న ఓ కలెక్టర్‌ని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఇలా ముందస్తు విడుదల చేయడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ నితీష్ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్నిసమర్థించుకున్నాయి. ఈ కారణం చూపించి "ముందస్తు విడుదలకు అనర్హుడు" అని తేల్చలేమని వివరిస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీనిపై ఇప్పటికే మాటల యుద్ధం మొదలు పెట్టింది. జి కృష్ణయ్య భార్య కూడా ఆనంద్ మోహన్‌ని విడుదల చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ "విడుదల"తో బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. రాజ్‌పుత్ ఓట్లను రాబట్టుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 

ఎవరీ ఆనంద్ మోహన్..? 

1990లో రాజకీయాల్లోకి వచ్చారు ఆనంద్ మోహన్ సింగ్. జనతా దళ్ పార్టీ నుంచి పోటీ చేశారు. హమ్హిషి నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటికి నితీష్ కుమార్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ జనతా దళ్‌లోనే ఉన్నారు. అయితే...అంతర్గత కలహాలతో వీళ్ల మధ్య దూరం పెరిగింది. అగ్రవర్ణమైన రాజ్‌పూత్ వర్గానికి చెందిన ఆనంద్ మోహన్‌కి లాలూ ప్రసాద్ మధ్య విభేదాలు వచ్చాయి. 1993లో ఆనంద్ మోహన్ జనతా దళ్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. అదే బిహార్ పీపుల్స్ పార్టీ (BPP). అప్పటి నుంచి అగ్రెసివ్‌గా మారిపోయారు. ఆయన ర్యాలీ పెడితే చాలు వేలాది మంది ప్రజలు తరలి వచ్చే వాళ్లు. రెండేళ్ల తరవాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్...షియోహర్‌ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరవాత NDAతో చేతులు కలిపారు. మళ్లీ NDAను వీడి UPAతో జట్టు కట్టారు. 

కృష్ణయ్య హత్య కేసు..

1994లో BPP పార్టీకి చెందిన చోటన్ శుక్లా హత్యకు గురయ్యాడు. ఆయన డెడ్‌బాడీని పట్టుకుని BPP నేతలంతా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కొంత మంది పోలీసులు కావాలనే అతడిని ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు ఆనంద్ మోహన్. ఒక్కసారిగా రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు మొదలయ్యాయి. పోలీసుల వాహనాలు ధ్వంసం చేశారు. మరుసటి రోజు ముజఫర్‌పూర్‌లో లాల్‌గంజ్ వద్ద నిరసనలు చేశారు. అక్కడే ఆనంద్ మోహన్ స్పీచ్ ఇచ్చారు. అదే సమయంలో గోపాల్‌గంజ్ నుంచి హాజీపూర్‌కి వస్తున్నారు గోపాల్‌గంజ్‌ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జి కృష్ణయ్య. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి. మహబూబ్‌నగర్ ఆయన సొంతూరు. సరిగ్గా ఆందోళనలు జరిగే సమయంలో ఆయన కార్‌ అటువైపు వచ్చింది. వెంటనే ఆందోళనకారులంతా ఆ కార్‌పై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. కాసేపట్లోనే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కృష్ణయ్యకు అప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ మూక దాడిలో ఆనంద్ మోహన్‌ హస్తం ఉందన్న ఆరోపణలొచ్చాయి. 2007లో దిగువ కోర్టు ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. ఆ తరవా పట్నా హైకోర్టు ఆ తీర్పుని సవరించి జీవిత ఖైదు వేసింది. కానీ...ఇప్పుడు శిక్ష పూర్తిగా అనుభవించకుండానే బయటకు రావడం వివాదాస్పదమవుతోంది. 

Also Read: ఉరికంబం ఎక్కే ముందు రుచికరమైన విందు, సొంత డబ్బుతో తోటి ఖైదీలకూ ఫుడ్ ఆర్డర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget