అన్వేషించండి

Vizianagaram Crime: విజయనగరంలో ప్రేమికుల మధ్య గొడవ.. కట్ చేస్తే చెట్టుకు వేలాడిన యువతి, అంతుబట్టని మిస్టరీ!

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సందిగూడ గ్రామ సమీపంలో మండంగి సంధ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

ఏడాది క్రితం వారిద్దరికీ పరిచయం.. అదీ కాస్తా ప్రేమగా మారింది. దీంతో అప్పుడప్పుడు యువకుడి ఇంటికి యువతి తరచూ వస్తుండేది. ఇంతలో ఏమైందో ఏమో.. గత మూడు రోజుల క్రితం యువతి చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.. ఏం జరిగింది..? ఇది ఆత్మహత్యా? హత్యా? విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సందిగూడ గ్రామ సమీపంలో మండంగి సంధ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తోటలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న స్థితిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలం గొహిది గ్రామానికి చెందిన సంధ్య విజయనగరం జిల్లాలో చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం పోలీసులను చేరింది. కేసునమోదు చేసుకున్న ఎల్విన్ పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గొహిది గ్రామానికి చెందిన మండంగి సంధ్యకు సుమారు ఏడాది క్రితం గుమ్మలక్ష్మీపురం మండలం సందిగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో తరచూ యువతి సందిగూడలోని లక్ష్మణ్ ఇంటికి వస్తుండేది. ఈ దశలో గత నెలలో వీరిద్దరి మద్య గొడవ జరిగింది. దీంతో యువతి సంధ్య యువకుడి సర్టిఫికేట్లు తీసుకుని వెళ్లిపోయింది. అయితే, ఉద్యోగ వేటలో ఉన్న లక్ష్మణ్ తన వద్ద సర్టిఫికేట్లు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన సర్టిఫికేట్లు ఇవ్వాలని, తాను పలు ఉద్యోగ పోస్టులకు దరఖాస్తు చేయాలని ఫోన్‌లో సంధ్యకు చెప్పాడు.

కాని యువకుడి అభ్యర్థనను సంధ్య పట్టించుకోక పోవడంతో చివరికి యువకుడు విషయాన్ని గొహిది సర్పంచ్ కు చెప్పి పంచాయితీ పెట్టించి మరీ తన సర్టిపికేట్లు తెప్పించుకున్నాడు. ఇక్కడితో సమస్య తీరిపోయిందని అంతా అనుకున్నారు. కాని గత నెల 28న సంధ్య మళ్లీ విజయనగరం జిల్లా సందిగూడ వచ్చింది. అయితే అప్పటికే యువకుడు లక్ష్మణ్ తన సొంత పని మీద విశాఖ జిల్లా వెళ్లాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది అన్నది తేలాల్సి ఉంది. వీరిద్దరు కలుసుకున్నారా? లేదా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం మాత్రం సంధ్య సందిగూడ గ్రామానికి సుమారు అర కిలో మీటరు దూరంలోని తోటలో శవంగా కనిపించింది.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా యువకుడు లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మంచి భవిష్యత్ ఉన్న యువత లక్ష్యాలను పక్కన పెట్టి ఆకర్షణలకు లోనై ప్రాణాలు తీసుకోవడం.. భవిష్యత్ ను నాశనం చేసుకోవడం దారుణమని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget